MP Raghurama: వైకాపాకు ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైకాపాకు రాజీనామా చేశారు.

Updated : 24 Feb 2024 10:45 IST

దిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైకాపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. ఈ లేఖలో ఆయన జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘పార్లమెంటరీ సభ్యత్వం నుంచి నన్ను అనర్హుడిగా చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. వైకాపా ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. వెంటనే ఆమోదించాలని కోరుతున్నా. అందరం ప్రజల తీర్పు కోరాల్సిన సమయం ఆసన్నమైంది. నరసాపురంలో నా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తా’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని