Maharashtra: సీట్ల సర్దుబాటుపై అనిశ్చితి.. ఉద్ధవ్కు రాహుల్ ఫోన్..!
మహారాష్ట్ర(Maharashtra)లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి పార్టీల మధ్య ఎనిమిది ఎంపీ సీట్ల విషయంలో చర్చలు ఒక కొలిక్కి రావాల్సిఉంది.
ముంబయి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్- ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పొత్తు ఓ పట్టాన కొలిక్కిరావడం లేదు. మహారాష్ట్ర(Maharashtra)లో శివసేన(యూబీటీ), శరద్పవార్ ఎన్సీపీ, హస్తం పార్టీ మధ్య ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.
మహారాష్ట్ర(Maharashtra)లో 48 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వాటిలో ఎనిమిది సీట్ల విషయంలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో చర్చలు ముందుకు సాగడం లేదు. దాంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi).. శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేశారు. ఇద్దరి మధ్య గంటపాటు సంభాషణ జరిగింది. ముంబయిలోని ఆరు లోక్సభ స్థానాల్లో మూడు చోట్ల నుంచి కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటోంది. మరోవైపు ఉద్ధవ్.. అక్కడి నుంచే నాలుగు సీట్లతో సహా మొత్తం 18 స్థానాలను ఆశిస్తున్నారు.
2019లో శివసేన(ఉద్దవ్+ శిందే వర్గం) 22 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా.. 18 మంది విజయం సాధించారు. వాటిలో ముంబయిలోని మూడు స్థానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. సీట్ల సర్దుబాటుపై రాహుల్, శరద్ పవార్ ఇప్పటికే ఫోన్లో చర్చలు జరిపారు. ఎంవీఏ కూటమి లోక్సభ సీట్ల సర్దుబాటు చివరి దశకు చేరుకుందని కాంగ్రెస్ వెల్లడించింది. మరోవైపు.. కాంగ్రెస్-ఆప్ మధ్య సీట్ల పంపిణీ చర్చలు తుది దశకు చేరినట్లు సమాచారం. దిల్లీతోపాటు హరియాణా, గుజరాత్, గోవాలలోనూ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం