Priyanka Gandhi: రాహుల్‌ అందరిలోకి ధైర్యవంతుడు: ప్రియాంక

సత్యం కోసం పోరాటాన్ని తన సోదరుడు రాహుల్‌గాంధీ ఏనాడూ ఆపలేదని, ఆయన అందరిలోకి ధైర్యవంతుడని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కొనియాడారు.

Updated : 06 Jun 2024 06:19 IST

దిల్లీ: సత్యం కోసం పోరాటాన్ని తన సోదరుడు రాహుల్‌గాంధీ ఏనాడూ ఆపలేదని, ఆయన అందరిలోకి ధైర్యవంతుడని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కొనియాడారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గతంలో కంటే స్థానాలు పెరిగిన నేపథ్యంలో బుధవారం ఈ మేరకు ‘ఎక్స్‌’లో ఆమె పేర్కొన్నారు. ‘‘వారు నీ గురించి ఏం చెప్పినా, నీ విషయంలో ఏం చేసినా ధైర్యంగా నిలబడ్డావు. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా వెనక్కి వెళ్లిపోలేదు. నీ చిత్తశుద్ధిని వారెంతగా శంకించినా నీపై నమ్మకాన్ని కోల్పోలేదు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా.. నిజం కోసం పోరాడటాన్ని మానుకోలేదు. కోపం, ద్వేషం వంటివి ఏనాడూ దరిచేరనివ్వలేదు. ప్రతిరోజూ వాళ్లు నీకు వాటినే కానుకగా ఇచ్చేవారు. అయినా నువ్వు ప్రేమ, నిజాయతీ, దయార్ద్ర హృదయంలో పోరాటం కొనసాగించావు. నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్న మాలాంటివాళ్లకు నీ ధైర్యసాహసాల గురించి తెలుసు. ఇంతవరకు నీ గురించి తెలియనివారు ఇప్పుడు తెలుసుకుంటారు. రాహుల్‌ భాయ్‌! నీకు సోదరినైనందుకు గర్వపడుతున్నాను’’ అని ప్రియాంక చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని