Rahul letter to modi : మోదీజీ.. కశ్మీరీ పండిట్లపై కనికరం చూపండి: రాహుల్
కశ్మీరీ పండిట్ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులను కశ్మీర్కు తిరిగి రావాలని బలవంతం చేయొద్దని రాహుల్ గాంధీ (Tahul Gandhi) కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీ (Modi)కి లేఖ రాశారు.
దిల్లీ: కశ్మీరీ పండిట్ (Kashmiri Pandits)లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులను తిరిగి కశ్మీర్కు రావాలని బలవంతం చేయొద్దని కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్ములో చాలా మంది కశ్మీర్ పండిట్లను కలిశానని, వాళ్ల కష్టాలు వింటుంటే కన్నీళ్లు వచ్చాయని రాహుల్ అన్నారు. విధుల కోసం తిరిగి కశ్మీర్కు రావాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో వాళ్లంతా దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఎప్పుడు దాడి చేసి చంపేస్తారోనని ఆందోళన చెందుతున్నారని, వాళ్లని లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా వాళ్లని వెనక్కి పిలవడం అంత శ్రేయస్కరం కాదని అన్నారు. పండిట్ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులను ఇతర శాఖల్లో భర్తీ చేయాలని కోరారు.
‘‘కశ్మీరీ పండిట్లు పడుతున్న ఇబ్బందుల గురించి మీకు తెలుసు అనే అనుకుంటున్నాను. వాళ్ల బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. కశ్మీర్ లోయలో పండిట్ సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు ఇతరులపైనా నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వాళ్లను తిరిగి కశ్మీర్కు వెళ్లాలని బలవంతం చేయడం అంత మంచిది కాదు’’ అని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా కశ్మీరీ పండిట్లను బిచ్చగాళ్లు అంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంభోదించడంపై రాహుల్ గాంధీ మోదీ దృష్టికి తీసుకెళ్లారు. జోడోయాత్ర సందర్భంగా కశ్మీరీ పండిట్లను కలిసినప్పుడు ఎల్జీ తమను బిచ్చగాళ్లుగా పేర్కొన్నారంటూ వారంతా రాహుల్ ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన రాహుల్.. ఎల్జీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మోదీకి రాసిన లేఖలో ఆ ఆంశాన్ని కూడా ప్రస్తావించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట