Revanth Reddy: హైదరాబాద్‌ చేరుకున్న రేవంత్‌రెడ్డి.. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు

సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు.

Updated : 07 Dec 2023 07:27 IST

హైదరాబాద్‌: సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో రేవంత్‌రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట పార్టీ సీనియర్‌ నేతలు శ్రీధర్‌బాబు, షబ్బీర్‌ అలీ, బలరామ్‌ నాయక్‌, సుదర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, సీపీ సందీప్‌ శాండిల్యా.. రేవంత్‌రెడ్డిని బేగంపేట విమానాశ్రయంలో కలిశారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని