Revanth Reddy: అంతకుమించిన తృప్తి ఏముంటుంది!: సీఎం రేవంత్‌ ఆసక్తికర ట్వీట్

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేడు ‘ప్రజాదర్బార్‌’ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రజా దర్బార్‌ జరిగిన తీరుపై సీఎం ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

Updated : 08 Dec 2023 17:38 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేడు ‘ప్రజాదర్బార్‌’ నిర్వహించిన విషయం తెలిసిందే. జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ వద్దకు వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజాదర్బార్‌ జరిగిన తీరుపై సీఎం రేవంత్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

‘‘జనం కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్బార్ సాగింది. జనం నుంచి ఎదిగి.. ఆ జనం గుండె చప్పుడు విని.. వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించిన తృప్తి ఏముంటుంది!’’ అని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న వీడియోను ఆయన పోస్ట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని