Lok Sabha polls: పంట పొలాల్లో దిగుతూ.. పతుల గెలుపు కోసం సతుల పాట్లు!
సంపన్న వర్గాలకు చెందిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మరొకరు మాజీ సీఎం కుమారుడు నకుల్నాథ్.. వీరి విజయం కోసం వారి జీవిత భాగస్వాములు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
భోపాల్: ఎన్నికల్లో (Lok Sabha Elections) గెలుపే లక్ష్యంగా అభ్యర్థులే కాకుండా వారి కుటుంబీకులూ ప్రచారంలో తలమునకలయ్యారు. మధ్యప్రదేశ్లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఇద్దరు అగ్రనేతల సతీమణులు ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్థానికుల సమస్యలు వింటూ, గొంతు కలుపుతూ, భజనలు చేస్తూ.. వారితో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పంట పొలాల్లోకి దిగి మహిళా రైతులతో చేయిచేయీ కలుపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారే కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia), మాజీ సీఎం కుమారుడు నకుల్నాథ్ (Nakul Nath) సతీమణులు. సంపన్న వర్గాలకు చెందిన ఈ నేతలు.. తమ విజయం కోసం జీవిత భాగస్వాములతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
తొలి ఓటమి నుంచి బయటపడేందుకు..
పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్రితం ఎన్నికల్లో గుణ లోక్సభ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో జ్యోతిరాదిత్య భార్య ప్రియదర్శిని రాజే (Priyadarshini Raje) సింధియా.. నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. గైక్వాడ్ రాజకుటుంబం నుంచి వచ్చిన ఆమె.. స్థానికంగా మార్కెట్లు ఇతర ప్రాంతాల్లో కలియతిరుగుతూ.. ప్రజలపై గ్వాలియర్ మహరాజ్ ఎంతో శ్రద్ధ చూపిస్తారంటూ ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కొవిడ్ సమయంలో స్థానికుల కోసం చేసిన సేవలను గుర్తుచేస్తున్నారు.
‘పట్టు’వదలకుండా..
కాంగ్రెస్ నేత, సిట్టింగ్ ఎంపీ నకుల్నాథ్.. లోక్సభలో అడుగుపెట్టిన సంపన్న వ్యక్తుల్లో ఒకరు. రూ.697 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించిన ఆయన.. 2019లో లోక్సభలో ఉన్న 475 కోటీశ్వరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. ఛింద్వాడా లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న నకుల్ తరఫున ఆయన భార్య ప్రియానాథ్ (Priya Nath) కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈక్రమంలో చోరై ప్రాంతంలో ఒకచోట మహిళా రైతు కూలీలతో చేయిచేయీ కలిపి పంటను కోస్తున్నట్లు దృశ్యాలు కనిపించాయి. అంతేకాకుండా నావేగావ్ గ్రామ మహిళలతో కలిసి భక్తిగీతాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. తన మామ కమల్నాథ్ సన్నిహితులు ఇటీవల భాజపాలో చేరడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కంచుకోటలో పోటాపోటీ..
ఛింద్వాడా, గుణ.. నియోజకవర్గాలు ఇరు కుటుంబాలకు కంచుకోటగా ఉన్నాయి. దశాబ్దాల కాలంగా వీరిదే ఆధిపత్యం. ఒకసారి మినహా 1980 నుంచి ఛింద్వాడా నాథ్ కుటుంబానిదే గెలుపు. 1997లో మాజీ సీఎం సుందర్లాల్ పట్వా చేతిలో కమల్నాథ్ ఓడిపోయారు. ఈసారి నకుల్నాథ్ను కాంగ్రెస్ ఇక్కడినుంచి పోటీలో నిలిపింది. గుణ నియోజకవర్గం అంటేనే సింధియా గుర్తొస్తుంది. ఈ కుటుంబానికి చెందిన నేతలు ఇక్కడి నుంచి 14సార్లు విజయం సాధించారు. 2002 నుంచి 2014 వరకు మూడుసార్లు ఇక్కడినుంచి గెలిచిన జ్యోతిరాదిత్య సింధియా.. 2019లో (కాంగ్రెస్) తొలిసారి ఓటమిని చవిచూశారు. ఈసారి భాజపా తరఫున పోటీలో ఉన్నారు.
మధ్యప్రదేశ్లో సంపన్నవర్గాలకు చెందిన నేతల ఎన్నికల ప్రచార తీరుపై భోపాల్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ శ్రావణి సర్కార్ మీడియాతో మాట్లాడుతూ.. గత దశాబ్దంలో ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా మారిందన్నారు. గతంలో మాదిరిగా ఉన్నతవర్గాలకే ఓటర్లు జై కొట్టడం లేదని.. సామాన్యులకు అందుబాటులో ఉండే స్వభావాన్నే కోరుకుంటున్నారన్నారు. ఈసారి మాత్రం జ్యోతిరాదిత్య సింధియా, నకుల్నాథ్ ఇద్దరికీ ఈ ఎన్నికలు కఠినంగానే కనిపిస్తున్నాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!