Gujarat Election 2022: ప్రచారానికే వెళ్లలేదు..నేనెలా సమాధానం చెప్పగలను: శశిథరూర్
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో.. ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.తాను ప్రచారానికి వెళ్లలేదని, అక్కడి పరిస్థితులు తనకెలా తెలుస్తాయని ఆయన మీడియాకు బదులిచ్చారు.
దిల్లీ: గుజరాత్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. కేవలం 17 స్థానాలకే పరిమితమైంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ స్పందన చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సీనియర్ నేతల అభిప్రాయం అడిగినప్పుడు.. పార్టీకి అనుకూలంగానే స్పందిస్తారు. కానీ, శశి థరూర్ మాత్రం ‘నేను ప్రచారానికి వెళ్లలేదు కదా.. అక్కడ పరిస్థితి గురించి నాకేం తెలుస్తుంది’ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘నేను ప్రచారానికి వెళ్లలేదు. ప్రచారానికి వెళ్లే వాళ్ల జాబితాలోనూ నా పేరు లేదు. అందుకే మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అధిష్ఠానం మాటను తోసిరాజని ఇటీవల పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై కాంగ్రెస్ అతడిపై గుర్రుగా ఉందనడం కాదనలేని వాస్తవం. ఈ క్రమంలోనే హిమాచల్ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అతడిని దూరం పెట్టింది. స్టార్ క్యాంపైనర్ల జాబితాలో ఆయనకు స్థానం కల్పించలేదు. దీంతో అందరు ఎంపీల మాదిరిగానే ఇవాళ్టి పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన కాంగ్రెస్పై తనకున్న వ్యతిరేకతను పరోక్షంగా బయటపెట్టారు. అయితే, ఈసారి ఆప్ రూపంలో కాంగ్రెస్కు భారీ గండి కొట్టిందన్నారు. కేవలం 5స్థానాలకే పరిమితమైన ఆప్ పార్టీ అంచనాలను అందుకోలేక పోయిందని చెప్పారు. దీనిని బట్టి రాష్ట్రంలో మళ్లీ క్రియాశీల పార్టీలు రెండే మిగిలినట్లయిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు గుజరాత్లో అధికార భాజపా వరుసగా ఏడోసారి విజయం సాధించింది. 37 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ 156 స్థానాలను కైవసం చేసుకుంది. 1985లో 149 నియోజకవర్గాల్లో విజయం సాధించి కాంగ్రెస్ నెలకొల్పిన రికార్డును కమలనాథులు బద్దలుకొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం