Chandrababu: సీఐడీ అధికారుల ఫోన్‌ సంభాషణలు సమర్పించేలా ఆదేశాలివ్వండి: సిద్ధార్థ లూథ్రా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో కేసులు రాజకీయ ప్రేరేపితమని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.

Updated : 10 Sep 2023 14:53 IST

విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో కేసులు రాజకీయ ప్రేరేపితమని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. ఆయన హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్‌ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్‌ చేశారని చెప్పారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సీఐడీ అధికారుల ఫోన్‌ సంభాషణలను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని సిద్ధార్థ లూథ్రా కోరారు. 

ఈ క్రమంలో సీఐడీకి న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. 2021లో కేసు పెడితే ఇప్పటి వరకు చంద్రబాబును ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును ఎందుకు చేర్చలేదని కోర్టు ప్రశ్నించగా.. రిమాండ్‌ రిపోర్ట్‌లో అన్ని అంశాలు చేర్చామని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి తెలిపారు. ఈ క్రమంలో 409 సెక్షన్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కోర్టు ప్రాంగణంలో వాదనల విరామ సమయంలో చంద్రబాబుతో సిద్ధార్థ లూథ్రా చర్చించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని