Bihar: బిహార్కు ప్రత్యేకహోదా!
ఎన్డీయేలో తెలుగుదేశంతోపాటు కీలక భాగస్వామ్య పక్షంగా మారిన జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ).. భాజపా ముందు కీలక డిమాండ్లు ఉంచుతోంది! బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తాము దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్ను మళ్లీ తెరమీదకు తెస్తోంది.
కీలక డిమాండ్ను తెరమీదకు తెస్తున్న జేడీయూ
దేశవ్యాప్త కులగణనను కూడా కోరే అవకాశం
దిల్లీ, పట్నా: ఎన్డీయేలో తెలుగుదేశంతోపాటు కీలక భాగస్వామ్య పక్షంగా మారిన జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ).. భాజపా ముందు కీలక డిమాండ్లు ఉంచుతోంది! బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తాము దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్ను మళ్లీ తెరమీదకు తెస్తోంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కోరుతోంది. జేడీయూ సీనియర్ నేత, బిహార్ మంత్రి విజయ్కుమార్ చౌధరీ పట్నాలో విలేకర్లతో మాట్లాడుతూ.. బిహార్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. విభజన తర్వాత తమ రాష్ట్రానికి ఎదురైన సమస్యల నుంచి గట్టెక్కడం ప్రత్యేక హోదా లేకుండా సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం నీతీశ్కుమార్ దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఆయన నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం నిరుడు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది కూడా. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో తాము ప్రత్యేక హోదా డిమాండ్లను పరిశీలించబోమని కేంద్రం గతంలో స్పష్టం చేసింది.
భాజపాకు బేషరతుగానే మద్దతు
జేడీయూ సీనియర్ నేత కె.సి.త్యాగి దిల్లీలో గురువారం విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమ పార్టీ భాజపాకు బేషరతుగా మద్దతిస్తోందని స్పష్టం చేశారు. అయితే అగ్నిపథ్పై ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. ఆ పథకంలోని లోపాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం అగ్నిపథ్ను సమీక్షించాలని డిమాండ్ చేశారు.
యూసీసీకి వ్యతిరేకం కాదు
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)కి జేడీయూ వ్యతిరేకం కాదని త్యాగి అన్నారు. దాన్ని అమల్లోకి తీసుకొచ్చేముందు అన్ని వర్గాలు, ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి.. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నదే తమ అభిమతమని చెప్పారు. కులగణన తమ డిమాండ్లలో ఒకటిగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సహా దేశంలో ఏ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించలేదని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కులగణన చాలా అవసరమని పేర్కొన్నారు.
రైల్వే, వ్యవసాయ శాఖలపై ఆసక్తి
కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీ గౌరవనీయ ప్రాతినిధ్యాన్ని ఆశిస్తున్నట్లు జేడీయూ నేత, బిహార్ మంత్రి శ్రవణ్ కుమార్ తెలిపారు. 2025లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవులను కేటాయించాలని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో తమ పార్టీ మూడు మంత్రి పదవులు కోరే అవకాశముందని జేడీయూ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. గ్రామీణాభివృద్ధి, రైల్వే, వ్యవసాయం, జలవనరులు, భారీ పరిశ్రమల వంటి శాఖలపై తమ పార్టీ ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు. పార్టీ నుంచి రాజీవ్ రంజన్సింగ్ లలన్, కౌశలేంద్ర కుమార్, రామ్ప్రీత్ మండల్, లవ్లీ ఆనంద్, సంజయ్ ఝా మంత్రి పదవుల రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
అగ్నిపథ్ను సమీక్షించాల్సిందే: చిరాగ్ పాస్వాన్
అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాల్సిందేనని ఎల్జేపీ(రాంవిలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ కూడా ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్త కులగణనకూ తమ పార్టీ అనుకూలమని పేర్కొన్నారు. కేంద్రంలో భాజపాకు తాము బేషరతుగానే మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు