Rajasthan Elections: భాజపా కంచుకోట ‘హాడౌతీ’.. ఈసారి ఎవరిదో?
రాజస్థాన్లోని హాడౌతీ ప్రాంతంపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా దృష్టి సారించాయి. ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎవరి బలాలేంటి?
ఇంటర్నెట్డెస్క్: హాడౌతీ (hadoti ).. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల (Rajasthan Assembly Elections) నేపథ్యంలో కాంగ్రెస్, భాజపాలు కీలకంగా దృష్టిసారించిన ప్రాంతం. ఒకప్పుడు భాజపాకి (BJP) కంచుకోటగా ఉన్న హాడౌతీ.. క్రమంగా హస్తం (Congress) పార్టీవైపు అడుగులేస్తోంది. ఈ ప్రాంతంలోని 17 నియోజకవర్గాల్లో 2018 ఎన్నికల్లో భాజపా 10 స్థానాలను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ 7 చోట్ల జయకేతనం ఎగురవేసింది. మొత్తం 200 సీట్లలో 17 స్థానాలు చిన్న సంఖ్యే అయినప్పటికీ.. పార్టీకి విజయావకాశాలు ఎంతమేర ఉన్నాయో ఇక్కడి ఫలితాలను బట్టి అంచనా వేయొచ్చు. అందుకే ఈ ప్రాంతంలో పూర్వ వైభవం పొందాలని భాజపా, మరిన్ని స్థానాలను సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి.
4 జిల్లాల పరిధిలో..
హాడౌతీ ప్రాంతం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. కోటా, బూందీ, బారాం, ఝలవార్ జిల్లాల వ్యాప్తంగా 17 నియోజకవర్గాల పరిధిలో ఈ రీజియన్ ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం కోసం ఇదే ప్రాంతానికి వెళ్లారంటే కమలదళం ఈ ప్రాంతానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంత అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలతో ప్రత్యేకంగా సమావేశమై.. బూత్ మేనేజ్మెంట్ గురించి వాళ్లకు సూచనలు సలహాలు అందించారు. పార్టీ విజయానికి పాటుపడాలని, పార్టీ ఉంటేనే మనమంతా ఉన్నామంటూ వాళ్లలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
ఆర్ఎస్ఎస్ ప్రభావం..
హాడౌతీ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ ప్రభావం చాలా ఎక్కువ. భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ ఈ ప్రాంతంలో తరచూ పర్యటించేవాళ్లు. రాజస్థాన్కు తొలి కాంగ్రెసేతర సీఎం భైరాన్ సింగ్ షెఖావత్ ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన వారే. 1977 ఉప ఎన్నికల్లో బారాం జిల్లాలోని ఛాబ్రా నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. అంతేకాకుండా రాజస్థాన్ తొలి మహిళా ముఖ్యమంత్రి వసుంధరా రాజే కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారే. జలరపటాన్ నియోజకవర్గం నుంచి ఆమె 4 సార్లు విజయం సాధించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా మొత్తం 17స్థానాలకు గానూ 16చోట్ల విజయం సాధించిందంటే ఆ పార్టీ ఎంతగా వేళ్లూనుకుందో చెప్పొచ్చు. అంతకుముందు కూడా భాజపాకి ఆ ప్రాంతంపై పూర్తి పట్టుంది. కానీ, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీయడంతో భాజపా 10 స్థానాలకు పరిమితమైంది.
భాజపాపై తగ్గిన మోజు
ఒకప్పుడు భాజపా వైపు మొగ్గు చూపే ఈ ప్రాంత ఓటర్లు గత ఎన్నికల నుంచి ఆ పార్టీకి విముఖత చూపిస్తున్నారు. 2018 ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. అలాగని అక్కడి వారంతా కాంగ్రెస్పై మోజు కనబరుస్తున్నారని చెప్పలేం. అయితే, ఈ రెండు పార్టీలను సరిపోల్చితే కాంగ్రెస్కే వీసమంతైనా మొగ్గు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ఓటర్ల కాంగ్రెస్వైపు మొగ్గు చూసే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలే ఇందుకు కారణం కావొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పించింది. ఝలవార్ ప్రాంతంలో రోడ్డు మార్గాలను అభివృద్ధి చేసింది. అయితే, రైతులకు గిట్టుబాటుధర కల్పించడంలో గహ్లోత్ ప్రభుత్వం విఫలమైందనే వాదనలు ఉన్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 20 ఏళ్లుగా వరుస విజయాలు సాధిస్తున్నారు. అయినప్పటికీ, ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు తీసుకురాలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.
వ్యవసాయం వెనకంజ
ఎన్ని ప్రభుత్వాలు మారినా హాడౌతీ ప్రాంతంలో వ్యవసాయ దిగుబడులను పెంచే ప్రయత్నం చేయడం లేదు. ఝలావర్ ప్రాంతంలో ఎక్కువగా నారింజ పంటను పండిస్తారు. దీనికి ‘నాగ్పుర్ ఆఫ్ రాజస్థాన్’ అని కూడా పిలుస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంలో వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంపై ఇరు పార్టీలపైనా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజా ఎన్నికల నేపథ్యంలో.. దీనికి పరిష్కారం చూపేందుకు ఇరు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.
కోటా అభివృద్ధి ఓకే.. కానీ,
రాజస్థాన్లో కోటా నగరానికి ప్రత్యేక స్థానముంది. వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ కోసం దేశ నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో మౌలిక సదుపాయాలను కల్పించింది. అయితే, ఇది ఎంతవరకు ఆ పార్టీకి అనుకూలంగా మారుతుందన్న దానిపై స్పష్టత లేదు. అయితే, కోటాలో ఇటీవల చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని భాజపా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణ లోపించిందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.
ఆ ఐదు స్థానాల్లో భాజపా సందేహమే..
హాడౌతీలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో 5 స్థానాల్లో భాజపా విజయం సాధించడం కత్తిమీద సామే. 1.హిందోలి.. ఇక్కడ గత 5 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 4 సార్లు విజయం సాధించింది. 2. కోటా ఉత్తర.. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రాబల్యం అధికం. ముఖ్యమంత్రి గహ్లోత్కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న శాంతి ధరివాల్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3. అంటా.. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోద్ జైన్కు ఈ స్థానంపై మంచి పట్టు ఉంది. 4. కిషన్ గంజ్.. గత 5 ఎన్నికల్లో భాజపా ఈ స్థానం నుంచి కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఈ నాలుగింటితోపాటు కాంగ్రెస్ నేత భరత్ సింగ్ బరిలో నిలుస్తున్న సంగోద్ నియోజకవర్గంపైనా భాజపా ఆశలు సన్నగిల్లుతున్నాయి. 2008, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి విజయం సాధించడంతో ఈసారి కూడా ఇక్కడ తమ గెలుపు అనుమానమేనని భాజపా వర్గాలు భావిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్