Varla ramaiah: ప్రతి శుక్రవారం కోర్టుకు.. రోజూ సీబీఐ విచారణకు ఇక నుంచైనా జగన్‌ హాజరుకావాలి

ఇక నుంచైనా జగన్‌రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు.. రోజూ సీబీఐ విచారణకు హాజరుకావాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సీబీఐ, ఈడీ కేసులను ఓ కొలిక్కి తీసుకురావడానికి సహకరించాలన్నారు.

Published : 08 Jun 2024 04:28 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు  వర్ల రామయ్య డిమాండ్‌ 

ఈనాడు డిజిటల్, అమరావతి: ఇక నుంచైనా జగన్‌రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు.. రోజూ సీబీఐ విచారణకు హాజరుకావాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సీబీఐ, ఈడీ కేసులను ఓ కొలిక్కి తీసుకురావడానికి సహకరించాలన్నారు. జగన్‌ అరాచకాలతోనే ఎన్నికల్లో వైకాపా ఓడిపోయిందని విమర్శించారు. 

పరాజయంపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి ఆ నెపాన్ని ఇతరులపై నెట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైకాపా పాలనలో దళితులపై దాడులు పెరిగాయి. బటన్లు నొక్కినంత మాత్రాన వారు చేసిన నేరాలను ప్రజలు మర్చిపోరు. మాచర్లలో వైకాపా వాళ్లకు భయపడి 250 ఎస్సీ కుటుంబాలు ఊళ్లు విడిచి వెళ్లిపోయాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు బేడీలు వేసి వీధుల్లో తిప్పారు. ఈ పాపాల ఫలితంగానే 29 ఎస్సీ నియోజకవర్గాల్లో వైకాపా 2 మాత్రమే గెలిచింది’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని