YSRCP: ఇంకా పేట్రేగిపోతున్న వైకాపా మూకలు
దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో ఐదేళ్లుగా పేట్రేగిపోయిన వైకాపా మూకలు.. అధికారం కోల్పోయాక కూడా అదే దమనకాండ కొనసాగిస్తున్నాయి.
అధికారం కోల్పోయినా అదే హింసాకాండ
6 రోజుల్లో ఇద్దరు తెదేపా కార్యకర్తల హత్య
తిరిగి, ‘దొంగే.. దొంగా దొంగా’ అన్నట్లుగా పెడబొబ్బలు
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం హత్యకు గురైన తెదేపా కార్యకర్త గిరినాథ్చౌదరి
ఈనాడు, అమరావతి: దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో ఐదేళ్లుగా పేట్రేగిపోయిన వైకాపా మూకలు.. అధికారం కోల్పోయాక కూడా అదే దమనకాండ కొనసాగిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక రాష్ట్రంలో గత ఆరు రోజుల్లో ఇద్దరు తెదేపా కార్యకర్తలను వైకాపా అరాచక శక్తులు బలిగొన్నాయి. అనేక చోట్ల భౌతిక దాడులకు తెగబడుతున్నాయి. ఫలితాలు వెల్లడైన రోజే మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన తెదేపా కార్యకర్త షేక్ ఖాశీం (24)ను వైకాపా కార్యకర్తలు కర్రలు, క్రికెట్ బ్యాట్లతో కొట్టి పాశవికంగా చంపేశారు. తమ పార్టీ గెలిచిన సంతోషంలో ఖాశీం ద్విచక్ర వాహనానికి తెదేపా జెండా కట్టుకుని స్నేహితుడితో కలిసి తిరుగుతుండగా, ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా మూకలు ఈ దారుణానికి ఒడిగట్టాయి. తాజాగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మరెడ్డిపల్లిలో తెదేపా కార్యకర్త గిరినాథ్ చౌదరి(35)ని వేట కొడవళ్లతో వెంటాడి నరికేశారు. ఆయన సోదరుడు కల్యాణ్పైనా హత్యాయత్నం జరగ్గా, తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై వైకాపా మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆమె అనుచరుల పాత్ర ఉందని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఇంతటి అరాచకాలకు పాల్పడుతున్న వైకాపా మూకలు, ‘దొంగే.. దొంగా దొంగా’ అన్న రీతిన పెడబెబ్బలు పెడుతున్నాయి. ఓ వైపు తెదేపా శ్రేణులపై దౌర్జన్యాలకు పాల్పడుతూనే, మరోవైపు తెదేపా కార్యకర్తలే తమపై దాడులు చేస్తున్నారంటూ గవర్నర్కు ఫిర్యాదు చేయడం వైకాపాకే చెల్లింది.
ఆటవిక పరిస్థితులు కల్పిస్తున్నదెవరు?
రాష్ట్రంలో తెదేపా శ్రేణులే లక్ష్యంగా వైకాపా నాయకులు పెద్ద ఎత్తున హింసాకాండను ప్రోత్సహిస్తుంటే.. ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి మాత్రం ఏమీ తెలియనట్లుగా ‘రాష్ట్రంలో తెదేపా దాడులతో ఆటవిక పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా నాయకులు, కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు?’ అంటూ ఇటీవల ట్వీట్ చేశారు. ఆ పార్టీ నాయకులు గవర్నర్ను కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను కిరాతకంగా చంపడమే వైకాపా దృష్టిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఓటమి కసితో దాడులు చేస్తున్నదీ, హింసను ప్రేరేపిస్తున్నదీ, ఉన్మాదంతో రెచ్చిపోతూ ప్రాణాలు తీస్తున్నదీ వైకాపా వారే. ఈ అకృత్యాలను కప్పి పుచ్చుకునేందుకు నెపాన్ని ఇతరులపై నెడుతున్నారు. వైకాపా హయాంలో నియమితులై ఆ పార్టీకి అంటకాగిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఇప్పటికీ అదే పంథాలో వెళ్తున్నారు. కొందరైతే పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ పక్షపాత వైఖరిపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించకపోతే శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే ముప్పు ఉంది.
కవ్వింపు చర్యల ఫలితమే ఘర్షణలు
ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేని వైకాపా శ్రేణులు పలుచోట్ల తెదేపా వారిని కవ్విస్తున్నాయి. ప్రతిగా, తెదేపా శ్రేణులు కూడా గతంలో తమపై జరిగిన దాడులను గుర్తుచేసుకుని వైకాపా దుందుడుకు చర్యల పట్ల స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడక్కడా ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల వైకాపా కార్యకర్తలూ బాధితులవుతున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు మాత్రం ‘వైకాపా శ్రేణులు కవ్వించినా, రెచ్చగొట్టినా, సంయమనం పాటించండి. వాటికి స్పందించొద్దు’ అని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం