TDP: సజ్జల ఆధ్వర్యంలో ఏపీలో ఫోన్‌ ట్యాపింగ్‌: డొక్కా మాణిక్య వరప్రసాద్‌

తెలంగాణలో మాదిరి ఏపీలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని మాజీ మంత్రి, తెదేపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆరోపించారు.

Updated : 05 Jun 2024 16:31 IST

అమరావతి: తెలంగాణలో మాదిరి ఏపీలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని మాజీ మంత్రి, తెదేపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందన్నారు. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలను రికార్డు చేశారని చెప్పారు. దీని ఆధారంగానే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందన్నారు. వైకాపా ప్రభుత్వం చేసిన ఈ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని