Graduate MLC by election: ఎమ్మెల్సీ విజేత తేలేది రెండో ప్రాధాన్య ఓట్లతోనే
వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు, ప్రతిపక్ష భారాసకు చెందిన ఏనుగుల రాకేశ్రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు.
వాటి లెక్కింపు ప్రారంభించిన అధికారులు
‘మొదటి ప్రాధాన్యం’లో మల్లన్నకు 18,565 ఓట్ల మెజార్టీ
తర్వాత స్థానంలో రాకేశ్రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్న సిబ్బంది
ఈనాడు, నల్గొండ: వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు, ప్రతిపక్ష భారాసకు చెందిన ఏనుగుల రాకేశ్రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసేసరికి తీన్మార్ మల్లన్న తన సమీప ప్రత్యర్థి.. ఏనుగుల రాకేశ్రెడ్డిపై 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కించిన నాలుగు రౌండ్లలో కలిపి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా.. రాకేశ్రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి.
భాజపా మద్దతిచ్చిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి 43,313 ఓట్లతో మూడో స్థానంలో, మరో అభ్యర్థి పాలకూరి అశోక్గౌడ్ 29,697 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు గురువారం రాత్రికి పూర్తి కాగా.. గెలుపు కోటా (చెల్లిన ఓట్లలో 50 శాతానికంటే ఒక ఓటు ఎక్కువ)గా పరిగణించే 1,55,095 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో విజేతను నిర్ణయించడానికి అధికారులు రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. గెలుపు కోసం తీన్మార్ మల్లన్నకు 32,282 ఓట్లు, రాకేశ్రెడ్డికి 50,847 ఓట్లు రావాలి. ఎలిమినేషన్ క్రతువు శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశాలున్నాయి.
ఏమిటీ ఎలిమినేషన్ ప్రక్రియ?
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యతలో గెలుపు కోటాకు సరిపడే ఓట్లు ఏ అభ్యర్థికీ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియలో రెండో ప్రాధాన్య ఓటును లెక్కించడం ద్వారా విజేతను నిర్ణయించనున్నారు. పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్య ఓట్లు అతి తక్కువగా వచ్చిన వారిని తొలుత గుర్తించి.. వారి బ్యాలెట్ పత్రాల్లో రెండో ప్రాధాన్య ఓటు ఎవరికి వచ్చిందో వాటిని ఆ అభ్యర్థికి జమ చేస్తారు. అనంతరం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని లెక్కింపు ప్రక్రియ నుంచి క్రమపద్ధతిలో తప్పిస్తారు. దీన్నే ఎలిమినేషన్ అంటారు. రిటర్నింగ్ అధికారి (ఆర్వో) దాసరి హరిచందన సూచన మేరకు అభ్యర్థులు సాధించిన ఓట్ల ఆధారంగా ఆరోహణ క్రమంలో జాబితాను తయారు చేశారు. అందులోని వారందరికీ సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
ఇలా చేపట్టారు..
తొలుత అతి తక్కువగా 10 ఓట్లు వచ్చిన స్వతంత్ర అభ్యర్థి యాతాకుల శేఖర్ని తొలగించి ఆయన బ్యాలెట్లో రెండో ప్రాధాన్య ఓట్లు వచ్చిన అభ్యర్థులకు ఆ ఓట్లను జమ చేశారు. ఆ తర్వాత 11 ఓట్లు వచ్చిన కొనకాల మోహన్రెడ్డి, 12 ఓట్లు వచ్చిన బూర ముత్తలింగంలను లెక్కింపు ప్రక్రియ నుంచి తొలగించి వారి బ్యాలెట్ పత్రాల్లో రెండో ప్రాధాన్య ఓట్లను సంబంధిత అభ్యర్థులకు బదిలీ చేశారు. ఎవరో ఒకరికి గెలుపు కోటా ఓట్లు వచ్చే వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. మొత్తం 52 మంది అభ్యర్థుల్లో తొలి ప్రాధాన్య ఓట్లలో 100 లోపు ఓట్లు వచ్చిన వారు 26 మంది, వెయ్యి లోపు ఓట్లు వచ్చిన వారు 20 మంది ఉన్నారు.
భారీగా చెల్లని ఓట్లు
ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు పోలవగా.. ఇందులో 25,824 చెల్లని ఓట్లుగా అధికారులు నిర్ధారించారు. వీటిలో తొలి మూడు స్థానాల్లో ఉన్న వారివే ఎక్కువగా ఉండటం గమనార్హం. మొదటి రెండు రౌండ్లలోనే 15,126 ఓట్లు చెల్లకుండా పోయాయి. నిబంధనల ప్రకారం ఓటర్లు బ్యాలెట్ పత్రాల్లో నచ్చిన అభ్యర్థి పక్కన ఉన్న గడిలో నంబర్లు వేయాల్సి ఉంది. కానీ చాలా మంది ఓటర్లు ఆ గడిలో రైట్ మార్కు చేయడం, అభ్యర్థి ఫొటోపై సంతకం, ప్రాధాన్యతను తెలిపే సంకేతాన్ని తెలుగులో, ఆంగ్లంలో రాయడం, కొన్ని చోట్ల ‘జై తెలంగాణ’ ‘జై కాంగ్రెస్’ వంటి నినాదాలు రాయడం వంటి చర్యలకు పాల్పడడంతో ఎక్కువ ఓట్లు చెల్లకుండా పోయాయి.
ఆరోపణలు.. ప్రత్యారోపణలు
మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మూడో రౌండ్లో తమకు వెయ్యి ఓట్లు ఎక్కువగా వచ్చినా కౌంటింగ్ ఏజెంట్ల సంతకం లేకుండానే ఆర్వో దాసరి హరిచందన ఏకపక్షంగా మీడియాకు వెల్లడించారని భారాస అభ్యర్థి రాకేశ్రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలను హరిచందన ఖండించారు. అనుమానాలుంటే నివృత్తి చేయడానికి సిబ్బంది, అధికారులున్నారని.. అసత్య ఆరోపణలు సరికాదన్నారు. లెక్కింపు విధుల్లో తమకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే ఆటంకం కలిగిస్తున్నారంటూ.. ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు తిప్పర్తి ఎస్సైకి ఫిర్యాదు చేశారు.
లెక్కింపులో అవకతవకలపై భారాస ఫిర్యాదు
హిమాయత్నగర్, న్యూస్టుడే: పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలపై ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, భారాస లీగల్ సెల్ సభ్యురాలు లలితారెడ్డి గురువారం సాయంత్రం బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నిక లెక్కింపులో భారాస మద్దతిచ్చిన రాకేశ్రెడ్డికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాకేశ్రెడ్డి మూడో రౌండ్లో 533, నాలుగో రౌండ్లో 170 పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉంటే.. జాబితాలో తీన్మార్ మల్లన్నకు చూపిస్తున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల