Congress: ఇంకా ఎక్కువ సీట్లు ఎందుకు రాలేదు?
శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఎంపీ సీట్లు రాకపోవడం రాష్ట్ర కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది.
లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్లో అంతర్మథనం
భారాస ఓట్లను పూర్తిగా ఆకర్షించలేకపోవడంపై చర్చ
ఈనాడు, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఎంపీ సీట్లు రాకపోవడం రాష్ట్ర కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది. అత్యధిక సీట్లతో భాజపాపై ఆధిక్యాన్ని సాధించలేకపోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేలు గెలిచి లోక్సభ ఎన్నికల్లో ఓట్లను పొందడంలో రెండో స్థానానికి పడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. ముందు నుంచీ పార్టీలో ఉన్న వారికి, కొత్తగా వచ్చిన వారికి మధ్య సమన్వయం లేకపోవడం, అభ్యర్థుల ఎంపికలో జాప్యం, కొన్ని స్థానాలకు ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకొని టికెట్లు ఇవ్వడం తదితరాలు దీనికి కారణం కావచ్చనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మహబూబ్నగర్, ఆదిలాబాద్, మెదక్, సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాలపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకొంది. ఇందులో కనీసం రెండు గ్యారంటీగా వస్తాయనుకున్నా... అన్నీ భాజపా ఖాతాలో చేరాయి. భారాస ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గి భాజపా వైపు మొగ్గు చూపడం, కొంత కాంగ్రెస్కు మళ్లినా... కొన్నిచోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన ఓట్లలో కూడా కొంత శాతం భాజపా వైపు మొగ్గు చూపడం తదితర కారణాలు కనిపిస్తున్నాయి. నాయకుల మధ్య సమన్వయలోపం కూడా సమస్య తెచ్చి పెట్టిందన్న అభిప్రాయముంది.
- అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో ఒకటి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఇలాంటి చోట తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, మానవ హక్కుల ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణను పోటీలో దింపి ప్రయోగం చేసింది. మంత్రి సీతక్క పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. పైగా సుగుణకు ఉన్న క్లీన్ ఇమేజీ కలిసొస్తుందని భావించింది. నిర్మల్, ముథోల్లలో భాజపా ఎమ్మెల్యేలు ఉండటం, ఇక్కడ కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తక్కువ ఓట్లు రావడంతో నిర్మల్ నుంచి మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని, ముథోల్ నుంచి మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డిని పార్టీలో చేర్చుకొంది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులకు, కొత్తగా చేరిన వారికి మధ్య సమన్వయం లేకపోవడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఈ లోక్సభ స్థానం పరిధిలో ఖానాపూర్లో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండగా, లోక్సభ ఎన్నికల్లో భాజపాకు ఆధిక్యం వచ్చింది. ఆదిలాబాద్లాంటి చోట నాయకుల మధ్య విబేధాలు కొనసాగాయి.
- మెదక్ లోక్సభ స్థానం పరిధిలోని నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకచోట మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నించి... నువ్వానేనా అనే స్థితికి వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి దామోదర్ రాజనరసింహ జహీరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నారు. మెదక్ ఇన్ఛార్జిగా కొండా సురేఖ గట్టి ప్రయత్నం చేశారు. ఇక్కడ భారాస గట్టిగా పోటీలో నిలిచినందున కాంగ్రెస్కు విజయావకాశాలు ఉంటాయని భావించారు. అయితే పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం, కొందరు సహకరించకపోవడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ వచ్చిన మెదక్లో ఈసారి రాకపోగా, సంగారెడ్డి, నర్సాపూర్లో మొదటి స్థానం వచ్చింది. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసింది.
- సీఎం రేవంత్రెడ్డి తన సొంత జిల్లాలోని మహబూబ్నగర్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అభ్యర్థిని ముందుగా ప్రకటించడంతోపాటు ఎక్కువసార్లు పర్యటించారు. బహిరంగ సభలు, రోడ్షోలలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్కు ఆధిక్యత వస్తే, ఇప్పుడు నాలుగింట్లో రెండోస్థానం రాగా, మిగిలిన చోట్ల మెజారిటీలు వచ్చాయి. ఎమ్మెల్యేలంతా గట్టిగానే పనిచేసినా... మిగిలిన వాళ్లు పూర్తి స్థాయిలో మమేకం కాకపోవడం ఓటమికి కారణంగా చెబుతున్నారు. ఇక్కడ అభ్యర్థి గతంలో ప్రాతినిథ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం కూడా నాగర్కర్నూల్ లోక్సభ స్థానం పరిధిలో ఉంది.
- చేవెళ్ల లోక్సభ అభ్యర్థిగా మొదట పట్నం సునీత వైపు మొగ్గు చూపినా రంజిత్రెడ్డి రావడంతో ఎవరు చేవెళ్ల, ఎవరు మల్కాజిగిరి అన్నదానిపైనే కొన్నాళ్లు గడిచిపోయాయి. చేవెళ్ల పరిధిలోని వికారాబాద్, తాండూరు తదితర నియోజకవర్గాల్లో పట్టున్న పట్నం సునీతను మల్కాజిగిరి లాంటి చోట పోటీకి నిలిపారు. మల్కాజిగిరిలో మరో బలమైన అభ్యర్థి లేకపోవడమే ఇందుకు కారణంగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. చేవెళ్లలో భారాస సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్రెడ్డికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని భావించినా, కాంగ్రెస్ కార్యకర్తలు దీనిని మనస్ఫూర్తిగా అంగీకరించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
- అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి లోక్సభ ఎన్నికల్లో భారీగా ఓట్లు కోల్పోయిన నియోజకవర్గాల్లో కరీంనగర్ ఒకటి. శాసనసభ ఎన్నికలప్పుడు హుస్నాబాద్ టికెట్ ఇవ్వలేకపోవడంతో ఎంపీగా పోటీకి అవకాశమిస్తామని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డికి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, అభ్యర్థిని చివరి వరకు తేల్చకపోగా, నామినేషన్ చివరి రోజున రాజేందర్రావును అభ్యర్థిగా ప్రకటించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈయన వైపు మొగ్గు చూపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే 1.65 లక్షల ఓట్లు తక్కువ రావడంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన చొప్పదండి, వేములవాడ, మానకొండూరులో చాలా తక్కువ ఓట్లు పడ్డాయి.
- నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని రంగంలోకి దింపడంతో జగిత్యాల, కోరుట్లలో ఎక్కువ ఓట్లు వస్తాయని భావించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన జగిత్యాలలో ఇప్పుడు నామమాత్రపు మెజారిటీ రాగా, కోరుట్లలో భాజపా అభ్యర్థికే భారీ మెజారిటీ దక్కింది. నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో జీవన్రెడ్డికి పరిచయాలు తక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన నిజామాబాద్ రూరల్లో ఇప్పుడు భాజపాకు భారీ ఆధిక్యత లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం