Bhatti: భారాస.. భాజపా మధ్య ఒప్పందం ఇంకా ఉంది: భట్టి విక్రమార్క
కాళేశ్వరం.. భారాసకు ఏటీఎంగా మారిందని విమర్శించిన భాజపా.. చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ప్రశ్నించారు.
ఖమ్మం: కాళేశ్వరం.. భారాసకు ఏటీఎంగా మారిందని విమర్శించిన భాజపా.. చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ప్రశ్నించారు. భారాస, భాజపా మధ్య ఒప్పందం ఇంకా ఉందని, కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగితే ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడారు. ‘నియంతృత్వ పాలకుల మీదే తిరుగుబాటు ఉంటుంది. మాది ప్రజాస్వామ్య పాలన.. మాపై తిరుగుబాటు ఉండదు. ఇప్పుడే ప్రజలు, అధికారులు స్వాతంత్ర్యం వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకే జవాబుదారీగా ఉంటుంది. ఎవరిపైనా ఒత్తిడిలేని పాలన కొనసాగిస్తాం’’అని భట్టి తెలిపారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ యూనివర్సిటీలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రపంచీకరణకు అనుగుణంగా వర్సిటీలో కోర్సులు పెడతామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్