Tamilisai: తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా చేశారు.

Updated : 18 Mar 2024 13:39 IST

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆమె పదవి వీడినట్లు సమాచారం. 2019 సెప్టెంబర్‌ 8న ఆమె తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఈ పదవికి కూడా ఆమె రాజీనామా సమర్పించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు.

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో తమిళనాడు నుంచి భాజపా తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ పదవి చేపట్టకముందు తమిళనాడు భాజపా అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని