Lok Sabha election Results: ‘లక్ష’ణంగా గెలిచారు.. తెలంగాణలో విజేతల మెజార్టీలివే..!
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, భాజపా విజయ ఢంకా మోగించాయి.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఫలితాలు వెల్లడించారు. కాంగ్రెస్ ఎనిమిది చోట్ల గెలుపొందగా.. భాజపా ఎనిమిది చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఎంఐఎం తన సీటును పదిలపరుచుకోగా.. భారాస ఎక్కడా ఖాతా తెరవలేకపోయింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, భువనగిరి, నాగర్ కర్నూలు, పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయఢంకా మోగించగా.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్లలో భాజపా అభ్యర్థులు గెలిచారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధిక అత్యధిక మెజార్టీతో జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి రికార్డు నెలకొల్పారు. దాదాపు 10మంది నేతలు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం.
- నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఘన విజయం సాధించారు. భాజపా అభ్యర్థి సైదిరెడ్డిపై 5,59,905 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించడం విశేషం. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ. 2011లో కడప లోక్సభ ఉప ఎన్నికలో 5.43 లక్షల మెజార్టీతో జగన్ గెలవగా.. అంతకుమించిన మెజార్టీతో రఘువీర్ విజయం సాధించారు.
- ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయం సాధించారు. ఆయన భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 4,67,847 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
- మల్కాజ్గిరిలో భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిపై ఆయన 3,91,4753 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
- మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ తన సమీప ప్రత్యర్థి భారాస నేత మాలోతు కవితపై 3.49 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
- హైదరాబాద్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ 3,38,087 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఒవైసీకి మొత్తంగా 6,61,981 ఓట్లు రాగా.. భాజపా అభ్యర్థి మాధవీలతకు 3.23లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థికి 62వేలు, భారాస అభ్యర్థికి 18వేలు చొప్పున ఓట్లు పోలయ్యాయి
- కరీంనగర్ లోక్సభ సీటు నుంచి భాజపా నేత బండి సంజయ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత వేల్చాల రాజేందర్ రావుపై 2,25,209 ఓట్ల తేడాతో గెలుపొందారు.
- వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయకేతనం ఎగురవేశారు. భాజపా అభ్యర్థి ఆరూరి రమేశ్పై 2,20,339 ఓట్ల తేడాతో రికార్డు విజయం నమోదు చేసుకున్నారు.
- భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి డా.బూర నర్సయ్యగౌడ్పై 2,22,170 ఓట్ల తేడాతో విజయఢంకా మోగించారు.
- పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపొందారు. భాజపా అభ్యర్థి శ్రీనివాస్పై 1,31,364 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
- నిజామాబాద్లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తన సీటును పదిలపరుచుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజార్టీ సాధించి జయకేతనం ఎగురవేశారు.
- నాగర్కర్నూలులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి గెలుపొందారు. భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ పోతుగంటిపై 94,414 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ భారాస అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు దాదాపు 3.2లక్షల ఓట్లు వచ్చాయి.
- ఆదిలాబాద్ లోక్సభ సీటు నుంచి భాజపా అభ్యర్థి నగేష్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై ఆయన 90,652 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు.
- జహీరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ తన ప్రత్యర్థి, భాజాపా నేత బీబీ పాటిల్పై 46,188 ఓట్ల తేడాతో గెలుపొందారు.
- సికింద్రాబాద్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్పై 49,944 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
- మెదక్లో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత నీలం మధుపై 39,139 పైచీలుకు ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.
- మహబూబ్నగర్లో జరిగిన ఉత్కంఠ పోరులో భాజపా అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై స్వల్ప ఆధిక్యంతోనే విజయం సాధించారు. రౌండ్ రౌండ్కు ఇక్కడ ఆధిక్యాలు మారడంతో నెలకొన్న ఉత్కంఠ పోరులో డీకే అరుణ కేవలం 4,500 ఓట్లతో గట్టెక్కారు.
- చేవెళ్లలో భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై దాదాపు 1,72,897 ఓట్ల మెజార్టీ సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు