Telangana news: 29న మేడిగడ్డకు తెలంగాణ మంత్రులు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష

డిసెంబరు 29న రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కలిసి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు.

Updated : 28 Dec 2023 15:29 IST

హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కలిసి డిసెంబరు 29న మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రులు మేడిగడ్డకు బయలుదేరుతారు. బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. ప్రాజెక్టు వ్యయం, దాన్ని కట్టడం ద్వారా జరిగిన లాభ, నష్టాలపై వివరణ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్తు, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలపై అధికారులు ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధం ఉన్న అందరూ సమావేశంలో పాల్గొనే విధంగా సమాచారం అందించాలని ఈఎన్సీని మంత్రులు ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని