S Jaishankar: ‘చైనా నంబర్ 1’ అని అప్పుడు నెహ్రూ చెప్పలేదా?: జైశంకర్
భారత తొలి ప్రధాని నెహ్రూ చేసిన కొన్ని తప్పిదాలే నేడు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే), చైనా రూపంలో భారత్ను ఇబ్బందిపెడుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు.
అహ్మదాబాద్: భారత తొలి ప్రధాని నెహ్రూ చేసిన కొన్ని తప్పిదాలే నేడు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే), చైనా రూపంలో భారత్ను ఇబ్బందిపెడుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (Jaishankar) అన్నారు. గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో భారత్ శాశ్వత సభ్యత్వంపై చర్చలు జరుగుతున్న సమయంలో నెహ్రూ భారత్ను కాదని చైనాకు ప్రాధాన్యమిచ్చారని జైశంకర్ నాటి ఘటనలను గుర్తుచేశారు. ముందుగా చైనాకు శాశ్వత సభ్యత్వం ఇచ్చాక భారత్కు ఇవ్వాలని నాడు నెహ్రూ అన్నారని తెలిపారు. కానీ, భాజపా ప్రభుత్వం మాత్రం మన దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు.
‘‘1950ల్లో సర్దార్ పటేల్ చైనా నుంచి భారత్కు ప్రమాదముందని హెచ్చరించారు. భవిష్యత్తులో చైనా, పీవోకే నుంచి సంక్లిష్టమైన పరిస్థితులను దేశం ఎదుర్కోనుందని చెప్పారు. చైనా తీరు అనుమానాస్పదంగా ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కానీ.. నెహ్రూ ఆయన మాటలను కొట్టి పడేశారు. హిమాలయాల అవతల నుంచి భారత్పై దాడి చేయడం అసాధ్యమన్నారు. అలాగే కశ్మీర్ అంశాన్ని ఐరాస ముందుకు తీసుకువెళ్లడం పటేల్కు ఇష్టం లేదు. ఈ విధంగా గతంలో జరిగిన పొరపాట్ల వల్లే మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు కొందరు సరిహద్దుల గురించి మాట్లాడుతూ వాటిని తిరగరాయాలంటున్నారు. మన సరిహద్దులను ఎప్పుడో నిర్ణయించుకున్నాం’’ అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
వారసత్వంగా వచ్చిన అనేక సమస్యలను గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రయత్నించిందని జైశంకర్ చెప్పారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్కు జెట్ ఇంజిన్ టెక్నాలజీని అందించేందుకు అమెరికా అంగీకరించిందని, సెమీకండక్టర్ చిప్లను తయారు చేసే మూడు సంస్థలు భారత్లో ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకొచ్చాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.