Modi Cabinet: భాజపా వర్మకు అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి
కేంద్ర క్యాబినెట్లో రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు దక్కాయి. ఎన్డీయే భాగస్వామి అయిన తెదేపా నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చారు.
తెదేపా నుంచి రామ్మోహన్నాయుడికి క్యాబినెట్ హోదా
సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్కు ఛాన్స్
దిల్లీలో ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులు
పురందేశ్వరి, సీఎం రమేష్కు నిరాశ
కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తున్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు
ఈనాడు - అమరావతి, దిల్లీ: కేంద్ర క్యాబినెట్లో రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు దక్కాయి. ఎన్డీయే భాగస్వామి అయిన తెదేపా నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చారు. గుంటూరు నుంచి తెదేపా ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయమంత్రి పదవి దక్కింది. మరోవైపు నరసాపురం ఎంపీ, భాజపా నేత భూపతిరాజు శ్రీనివాసవర్మ (బీజేపీ వర్మ)ను లోక్సభ టికెట్ మాదిరిగానే అమాత్యపదవి కూడా అనూహ్యంగా వరించింది. తొలి నుంచీ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికే పదవుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలన్న జాతీయ నాయకత్వం ఆలోచన శ్రీనివాసవర్మకు అదృష్టంగా మారింది. వీరు ముగ్గురూ ఆదివారం రాత్రి దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరికి తప్పకుండా మంత్రిపదవి దక్కుతుందని భావించినా నిరాశే ఎదురయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం పురందేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేశారు. అయినా పదవి దక్కకపోవడంపై ఆమె వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన సీఎం రమేష్.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆయనకూ క్యాబినెట్లో స్థానం లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ
పెమ్మసాని, శ్రీనివాసవర్మలకు తొలిసారే అదృష్టం
శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడికి ఊహించినట్లుగానే క్యాబినెట్ మంత్రి పదవి దక్కింది. ఈ ఎన్నికలకు ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి, గుంటూరు లోక్సభ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ను తొలి దఫాలోనే కేంద్ర (సహాయ) మంత్రి పదవి వరించింది. నరసాపురం భాజపా ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ కూడా తొలిసారి గెలిచారు. ఆయన కూడా నేరుగా కేంద్ర సహాయమంత్రి హోదాలోనే లోక్సభలో అడుగుపెడుతుండటం విశేషం.
కౌన్సిలర్ నుంచి కేంద్ర మంత్రి వరకు..
భీమవరానికి చెందిన శ్రీనివాసవర్మ డిగ్రీ చదువుతుండగా వామపక్ష విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. 1990లో భాజపాలో చేరారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భాజపా అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన ఆయన అందరికీ భాజపా వర్మగా సుపరిచితులు. 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భీమవరంలోని 4వ వార్డు నుంచి భాజపా కౌన్సిలర్గా గెలుపొందారు. 2009లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి, ఓటమి చవిచూశారు. తాజా ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఆయనకు అనూహ్యంగా పార్టీ టికెట్ కేటాయించింది. ఓ దశలో టికెట్ మార్పుపై ఊహాగానాలు సాగినా భాజపా నాయకత్వం వర్మపైనే నమ్మకం ఉంచింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైకాపా అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.70 లక్షల మెజారిటీతో గెలిచారు.
నరసాపురం నుంచి రెండో మంత్రి
నరసాపురం నియోజకవర్గం నుంచి 1999లో భాజపా తరఫున గెలుపొందిన ప్రముఖ సినీనటుడు, దివంగత ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజుకు కేంద్ర మంత్రి పదవి లభించింది. ఇదే స్థానం నుంచి ఇప్పుడు వర్మకూ కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది.
దేవుడే దారి చూపాడు: పెమ్మసాని చంద్రశేఖర్
ప్రజలకు సేవ చేయాలన్న దృఢసంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడు దేవుడు దాన్ని నెరవేర్చే దారిచూపాడని కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ‘తొలిసారి ఎంపీ అయిన నన్ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడానికి ఆమోదం తెలిపిన చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు. మోదీ క్యాబినెట్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. గుంటూరు ప్రజలు నాపై ఎంతో నమ్మకం ఉంచి గెలిపించారు. మా మంత్రిత్వ శాఖల తరఫున దేశానికి మా వంతు సేవ చేస్తాం’ అని చెప్పారు.
భాజపా కార్యకర్తలకు దక్కిన పదవి ఇది: శ్రీనివాసవర్మ
పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందడానికి తానే ఉదాహరణ అని కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ‘పొత్తులో భాగంగా నరసాపురం స్థానాన్ని నాకు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భాజపా కార్యకర్తలంతా వచ్చి నా విజయం కోసం పనిచేశారు. మూడు పార్టీల కార్యకర్తలు అహర్నిశలు కష్టపడ్డారు. ప్రధాని మోదీ మంత్రివర్గంలో నాకు స్థానం కల్పించడాన్ని తెలుగు రాష్ట్రాల్లో భాజపాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా’ అని పేర్కొన్నారు.
హామీల అమలుకు నిర్విరామంగా పనిచేస్తాం
కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు
నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడ కష్టాల్లో ఉన్నా ఆదుకుంటూ వస్తోందని, అదే తరహాలో వచ్చే ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తామని కేంద్ర మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. మోదీ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ పదవులను రాష్ట్ర ప్రజలకే అంకితం చేస్తున్నాం. ఇవి వారి పదవులే తప్ప మా పదవులు కాదు. కేంద్ర మంత్రిమండలిలో పనిచేయడం ఆనందకరం. మా తండ్రి దివంగత ఎర్రన్నాయుడు పైనుంచి నిరంతరం ఆశీర్వదిస్తూ, వెన్నుతట్టి నడిపిస్తున్నారు. నాన్న చనిపోయినప్పటి నుంచి నాకు మార్గదర్శనం చేస్తూ ముందుకు నడిపిస్తున్న మా పార్టీ అధినాయకుడు చంద్రబాబునాయుడితో పాటు, సోదరుడు లోకేశ్, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ, బాబాయి అచ్చెన్నాయుడులకు ధన్యవాదాలు తెలుపుతున్నా. మా కుటుంబసభ్యులు ఎన్నో త్యాగాలు చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు.
తమ ప్రేమాభిమానాలతో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. తెలుగు ప్రజలు, తెలుగుదేశం, జనసేన, భాజపా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి చరిత్రాత్మక విజయం చేకూర్చారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు, మోదీ నేతృత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. రాష్ట్రం కోసం మేం పదేళ్లుగా పోరాడుతూనే ఉన్నాం. మోదీ తొలి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం పొందాం. ఇంకా పొందాల్సినవి ఉన్నాయి. వాటిని సాధించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్న చంద్రబాబు లక్ష్యసాధనకు సంపూర్ణంగా పనిచేస్తాం. మోదీ సాయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. మా నాయకులు మాపై ఏ బాధ్యత పెట్టినా, ఎలా నడిపించినా మేం అంతఃకరణ శుద్ధితో పనిచేస్తాం’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం