Maharashtra: చిచ్చు రేపిన మూడు స్థానాలు.. ‘అఘాడీ’లో అంతర్గత పోరు
మహావికాస్ అఘాడీలో అంతర్గత పోరు రగులుతోంది. ముఖ్యంగా మూడు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు విషయంలో అఘాడీ నేతలు ఓ పరిష్కారానికి రాలేకపోతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: లోక్సభ ఎన్నికల ముంగిట మహారాష్ట్రలోని (Maharashtra) రాజకీయాలు మళ్లీ మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే శివసేన (Shiv sena), ఎన్సీపీలో (NCP) ఏర్పడిన చీలికలు కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీయగా.. తాజాగా కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్పవార్) వర్గాలతో ఏర్పడిన మహావికాస్ అఘాడీ కూటమిలోనూ అంతర్గత పోరు తీవ్రమవుతోంది. ఒప్పందానికి విరుద్ధంగా కీలకమైన మూడు స్థానాల్లో శివసేన (యూబీటీ), అభ్యర్థులను ప్రకటించడం వివాదాలకు తావిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు శరద్పవార్ రంగంలోకి దిగినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.
తాజా లోక్సభ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో సంగలీ, ముంబయి సౌత్ సెంట్రల్ నియోజకవర్గాలున్నాయి. భివండీ స్థానంలో ఎన్సీపీ (శరద్పవార్) వర్గం బరిలోకి దిగాలని యోచిస్తోంది. అయితే, ఈ మూడు స్థానాలను తన వద్దే ఉంచుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఈనేపథ్యంలో దీనికి ఓ పరిష్కారం కనుగొనేందుకు గురువారం రాత్రి శరద్పవార్ నేతృత్వంలో మూడు పార్టీల ముఖ్య నేతలు సమావేశమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నుంచి పృథ్వీరాజ్ చవాన్, బాలాసాహెబ్ థోరట్ తదితరులు హాజరయ్యారు. ప్రత్యేకంగా ఈ మూడు స్థానాలపైనే చర్చ జరిగింది. వాటిని వదులుకునేందుకు కాంగ్రెస్ ససేమిరా అనడంతో తదుపరి సమావేశం సోమవారానికి వాయిదా పడింది.
మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలున్నాయి. వీటిలో 44 స్థానాలకు మహావికాస్ అఘాడీ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. ఇందులో భాగంగా శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్ 16, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 సీట్లను కేటాయించారు. మిగతా నాలుగు స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. అవే సంగలీ, ముంబయి సౌత్ సెంట్రల్, భివండీ, ముంబయి వాయువ్య స్థానాలు. అయితే, తాము మొత్తం 22 స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన (యూబీటీ) నేత సంజయ్రౌత్ ప్రకటించడం కూడా కూటమిలో అసంతృప్తికి కారణమవుతోంది.
శరద్పవార్ సంప్రదింపులు ఫలించేనా?
వివాదాస్పదమవుతున్న స్థానాల్లో అభ్యర్థుల ఖరారు అంశాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు శరద్పవార్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. వారి సూచన మేరకు శుక్రవారం రాత్రి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ రమేశ్ అధ్యక్షతన పార్టీ అంతర్గత సమావేశం జరిగింది. ఈ భేటీలోనూ ఎలాంటి పరిష్కారం లభించలేదు. మిత్రపార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, లేదంటే ప్రత్యర్థులకు ఇది అవకాశంగా మారుతుందని శరద్పవార్ హితవు పలుకుతున్నారు. భివండీ స్థానాన్ని ఆశిస్తున్న ఎన్సీపీ (శరద్పవార్)కి ప్రతికూలత ఎదురైతే సమస్య మరింత జఠిలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత నసీమ్ ఖాన్ మాట్లాడుతూ.. శివసేన (యూబీటీ) ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం సరికాదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంగలీ, ముంబయి సౌత్ సెంట్రల్, భివండీ స్థానాలను వదులుకోబోమని, ముంబయి నార్త్, ముంబయి వాయువ్య స్థానాల్లోనూ స్నేహపూర్వక పోరాటం ఉంటుందని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ తీరును శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తప్పుబట్టారు. ఇలాంటి పరిస్థితులు భాజపాకి అనుకూలంగా మారుతాయని చెప్పారు. కాంగ్రెస్ పరిణితి చెందిన పార్టీ అనీ, ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కూటమిలో ఇలాంటి పొరపచ్చాలు సహజమేనని, బిహార్, ఉత్తర్ప్రదేశ్లోనూ శివసేన (యూబీటీ) స్నేహపూర్వక పోరు ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్