INDIA Bloc: ఉక్కిరిబిక్కిరి చేసిన ‘ఇండియా’
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ఊహించని పాటవంచూపి భాజపాతో పాటు, స్టాక్మార్కెట్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.
హిందీ రాష్ట్రాల్లో తిరిగి పుంజుకున్న కూటమి పక్షాలు
వ్యూహాత్మక అడుగులతో పరస్పర లబ్ధి
ఈనాడు, దిల్లీ: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ఊహించని పాటవంచూపి భాజపాతో పాటు, స్టాక్మార్కెట్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. విడివిడిగా చూస్తే బలహీనంగా కనిపించిన పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గట్టి సవాల్ విసిరాయి. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజార్టీ భాజపాకు దక్కకుండా నిలువరించగలిగాయి. చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సంఖ్యలో 330 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ 30% మేర గెలుపుతో 99 స్థానాలు గెలుచుకొని గత రెండు ఎన్నికల కంటే మెరుగైన పనితీరును కనపరిచింది. కేరళలో ఒక స్థానం కోల్పోయినా, తమిళనాడులో స్థానాలు నిలబెట్టుకుంది. కర్ణాటక, తెలంగాణల్లో పుంజుకుంది. కేరళ, కర్ణాటక, తెలంగాణల్లో సంస్థాగత బలం, తమిళనాడులో మిత్రపక్ష డీఎంకే అండతో గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకోగలిగింది.
భారత్జోడో యాత్రతో ఉత్తేజం
తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పార్టీ అగ్రనేత ప్రారంభించిన భారత్జోడో పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్తేజితుల్ని చేసింది. మహారాష్ట్రలో భాజపా చేసిన తప్పులు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు కలిసి వచ్చాయి. శివసేనను నిలువునా చీల్చి అనూహ్యంగా ఉద్ధవ్ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చడంతోపాటు, శరద్పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని రెండుగా చీల్చడం ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. అదే ఇప్పుడు కాంగ్రెస్ను ఒక స్థానం నుంచి 13 స్థానాలకు చేర్చి, రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించేలా తయారుచేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్సీపీ బలం నాలుగు నుంచి ఏడుకు పెరిగింది. మొత్తంగా ఎన్డీయే బలం 41 నుంచి 18కి పడిపోయేలా చేసింది. రాజస్థాన్లో గత రెండు ఎన్నికల్లో సున్నాకి పరిమితమైన హస్తం ఈసారి మిత్రపక్షాలతో కలిసి 11 స్థానాలను గెలుచుకుంది. తొలిసారి ఎమ్మెల్యే అయిన భజనల్లాల్ శర్మను గత డిసెంబరులో ముఖ్యమంత్రిని చేయడం నచ్చని భాజపా సీనియర్లు కాషాయదళానికి మనస్ఫూర్తిగా పనిచేయకపోవడం నష్టం చేసింది. సచిన్ పైలట్ విస్తృత ప్రచారంతో గుజ్జర్ సామాజికవర్గం కాంగ్రెస్కు అండగా నిలవడం వల్ల హస్తం కూటమికి ఇక్కడ 11 సీట్లు దక్కాయి.
చతుర్ముఖ పోరుతో లబ్ధి
కాంగ్రెస్ తన బలాన్ని నిలబెట్టుకున్న మరో రాష్ట్రం పంజాబ్. ఆప్, కాంగ్రెస్లు దేశవ్యాప్తంగా ఇండియా కూటమిగా పోటీచేసినా, ఇక్కడమాత్రం ప్రత్యర్థులుగా తలపడ్డాయి. పోటీ చతుర్ముఖంగా మారి కాంగ్రెస్ లబ్ధిపొందింది. అధికారంలో ఉన్న ఆప్ కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుని పూర్వవైభవాన్ని సంతరించుకొంది. ఉత్తర్ప్రదేశ్లో గత ఐదేళ్లుగా ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తూ రావడం; ముస్లిం, యాదవులు, దళితులు ఇండియా కూటమికి అండగా నిలవడం ఎస్పీ-కాంగ్రెస్లకు కలిసి వచ్చింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దిల్లీ ఎన్నికలపై ప్రభావం చూపకపోయినా ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్సోరెన్ అరెస్టు అక్కడి ఫలితాలను ప్రభావితం చేయడంతో ఇండియా కూటమికి 5 స్థానాలు దక్కాయి. రాహుల్గాంధీ భారత్జోడో న్యాయయాత్ర మణిపుర్ నుంచి మొదలుపెట్టి ముంబయిలో ముగించడంవల్ల ఆ రెండురాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రయోజనం పొందగలిగింది. హరియాణాలో అకస్మాత్తుగా ముఖ్యమంత్రిని మార్చడం భాజపాకు వ్యతిరేకంగా పనిచేసింది. గత ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచిన భాజపా ఇప్పుడు 5 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది.
స్థానిక అంశాలపై పోరుతో మంచి ఫలితం
కాంగ్రెస్పార్టీ ఈ ఎన్నికల్లో జాతీయ అంశాల కంటే స్థానిక అంశాల ఆధారంగానే పోరాడటం వల్ల మంచి ఫలితాలను సాధించగలిగింది. సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకుని ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్, వామపక్షాలకంటే మమతాబెనర్జీయే బలంగా కనిపించడంతో భాజపా విధానాలు నచ్చని ఓటర్లంతా తృణమూల్ వైపే మొగ్గుచూపారు. దీంతో తృణమూల్ బలం 22 నుంచి 29కి పెరిగింది. మహారాష్ట్రలో 12 లోక్సభ నియోజకవర్గాల్లో ఉల్లిపంట ప్రధాన ఆదాయవనరు. గతంలో ఈ స్థానాలు ఏకపక్షంగా ఎన్డీయేకు దక్కాయి. ఈసారి వీటిల్లో ఏడు సీట్లు ఇండియా కూటమికి వెళ్లాయి. 2023 నుంచి కేంద్రం ఉల్లి ఎగుమతుల విధానంలో తరచూ మార్పులు చేస్తుండటం దీనికి కారణంగా భావిస్తున్నారు. ఇండియా కూటమి కారణంగా కాంగ్రెస్తో పాటు ఎస్పీ, శరద్పవార్, ఆర్జేడీ, ఎన్సీపీ (శరద్చంద్రపవార్), శివసేన (యూబీటీ), జేఎంఎం, వామపక్షాలు ప్రయోజనం పొందగలిగాయి. రాహుల్, ప్రియాంకాగాంధీ పర్యటనలతో పాటు సిద్దరామయ్య, డీకే శివకుమార్, రేవంత్రెడ్డి, సచిన్ పైలట్లాంటి నాయకులు కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంలో తమదైన పాత్ర పోషించారు. ఏ కూటమిలో లేని కారణంగా భారాస, వైకాపా, బిజద, బీఎస్పీలు తీవ్రంగా నష్టపోయాయి.
క్షేత్ర స్థాయి పోరాటవీరుడు ఖర్గే
క్షేత్ర స్థాయి పోరాటవీరుడైన 81 ఏళ్ల మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తేవడంలో సఫలమైనా అధికారంలోకి తేలేకపోయారు. పదవి చేపట్టిన రెండేళ్లలో ఆయన పొత్తులను కుదర్చడంలో, పార్టీకి 99 స్థానాలను సాధించడంలో విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో 22 రాష్ట్రాల్లో దాదాపు 100 ర్యాలీల్లో ఖర్గే పాల్గొన్నారు. 70 మీడియా సంస్థలతో మాట్లాడారు. పార్టీలో గ్రూపు తగాదాలను అరికట్టడంలోనూ సఫలమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల