TMC: పేదలకు ఉచితంగా 10 వంట గ్యాస్ సిలిండర్లు.. టీఎంసీ మేనిఫెస్టో విడుదల
లోక్సభ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేస్తే పేదలకు ఉచితంగా 10 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది.
కోల్కతా: లోక్సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆ పార్టీ ముఖ్య నేతలు ‘ఇండియా’ కూటమిలో భాగంగా పలు ప్రజా సంక్షేమ హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతీ కుటుంబానికి ఏటా 10 వంట గ్యాస్ సిలిండర్లు, ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయడంతో పాటు ఎం.ఎస్. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలుచేసి రైతులను ఆదుకుంటామన్నారు.
ఈసందర్భంగా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ.. దేశంలో సామాన్యుడికి భారంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తామని, ఇందుకోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తామని తెలిపారు. అలాగే, సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత అమిత్ మిత్రా తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ 100 రోజుల పాటు పని కల్పిస్తామని, రోజుకు రూ.400ల చొప్పున వేతనం చెల్లిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వెనకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఇచ్చే స్కాలర్ షిప్లను మూడు రెట్లు పెంచనున్నట్లు హామీ ఇచ్చారు. సీట్ల వ్యవహారంలో నెలకొన్న విబేధాలతో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తున్నప్పటికీ.. ‘ఇండియా’ కూటమిలో తాము భాగంగానే ఉన్నట్లు పేర్కొంటోంది. బెంగాల్లో ఈసారి తృణమూల్, భాజపా మధ్య హోరాహోరీ పోరు నెలకొనగా.. కాంగ్రెస్- లెఫ్ట్ పార్టీలు కలిసి లౌకిక కూటమిగా బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.