Lok Sabha Polls: ‘తృణమూల్‌’కు 40మంది స్టార్‌ క్యాంపెయినర్లు.. జాబితా విడుదల

ఎన్నికల ప్రచారానికి 40మంది స్టార్‌ క్యాంపెయినర్లతో తృణమూల్‌ కాంగ్రెస్‌ జాబితాను విడుదల చేసింది.

Published : 27 Mar 2024 00:12 IST

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) గెలుపే లక్ష్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ.. ప్రచారంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. ఇందులో భాగంగా 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లను ఎంపిక చేసింది. ఈ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు ఆ పార్టీ నేతలు సుబ్రత బక్షి, అభిషేక్‌ బెనర్జీ, సుదీప్‌ బంధోపాధ్యాయ్‌, సౌగత రాయ్‌, కల్యాణ్‌ బెనర్జీ, శతాబ్ది రాయ్‌, కునాల్‌ ఘోష్‌, మాజీ క్రికెటర్‌ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌, సినీనటి రచనా బెనర్జీ, మమతా ఠాకూర్‌ తదితరులు ఉన్నారు. బెహరాంపుర్‌ నుంచి యూసుఫ్‌ పఠాన్‌, హుగ్లీ నుంచి రచనను లోక్‌సభ అభ్యర్థులుగా టీఎంసీ బరిలో దించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని