Khammam: దొంగ ఓట్ల నమోదుపై చర్యలు తీసుకోండి: ఈసీకి తుమ్మల లేఖ
దొంగ ఓట్ల నమోదుపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) కోరారు.
ఖమ్మం: దొంగ ఓట్ల నమోదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) కోరారు. ఖమ్మం జిల్లాలో ఇంటి నంబర్లు లేకుండానే ఓట్లు నమోదు చేశారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఖమ్మం నియోజకవర్గాల వారీగా నమోదు చేసిన దొంగ ఓట్ల వివరాలతో కూడిన లేఖను తుమ్మల ఈసీకి అందించారు.
ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 30 వేలకు పైగా ఓట్లను ఇంటి నంబర్లు లేకుండానే నమోదు చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, సీఈవో ఇతర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ మేరకు గతంలో చేసిన 9 ఫిర్యాదుల వివరాలను కూడా ఈసీకి పంపిన లేఖకు తుమ్మల జత చేశారు. ఓట్ల జాబితా తుది ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో దొంగ ఓట్లపై దృష్టి సారించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఇంటి నంబర్లు లేకుండా నమోదు చేసిన ఓట్లను వెంటనే తొలగించి.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. జాబితా నుంచి దొంగ ఓట్లను తొలగించిన తర్వాతే తుది ప్రకటన విడుదల చేయాలని ఈసీని తుమ్మల కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!