Chandrababu-Amit Shah: చంద్రబాబుతో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా భేటీ

తెదేపా అధినేత చంద్రబాబుతో  కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా సమావేశమయ్యారు.

Published : 11 Jun 2024 22:45 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుతో  కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా సమావేశమయ్యారు. తన నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రులకు చంద్రబాబు స్వాగతం పలికారు. మంత్రివర్గ కూర్పు, భాజపా నుంచి ఎవరికి పదవులు అనే దానిపై నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. భాజపా విషయంలో స్పష్టత వచ్చాక మంత్రివర్గంపై స్పష్టత వచ్చే అవకాశముంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మంత్రుల జాబితాను చంద్రబాబు.. గవర్నర్‌కు పంపనున్నట్టు సమాచారం. మంత్రులగా అవకాశం దక్కిన నేతలకు చంద్రబాబు స్వయంగా ఫోన్‌ చేసి చెప్పనున్నారు. ఇప్పటికే పలువురు ఆశావహులు విజయవాడ, గుంటూరులో మకాం వేశారు. చంద్రబాబు నుంచి వచ్చే ఫోన్‌ కోసం మంత్రి పదవి ఆశావహులు నిరీక్షిస్తున్నారు. అంతకు ముందు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రులకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని