Uttam Kumar Reddy: రూ.56వేల కోట్ల నష్టంలో పౌర సరఫరాల శాఖ: మంత్రి ఉత్తమ్‌

గత పాలకుల వల్ల పౌరసరఫరాల శాఖలో తప్పిదాలు జరిగాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు.

Updated : 12 Dec 2023 17:45 IST

హైదరాబాద్‌: గత పాలకుల వల్ల పౌరసరఫరాల శాఖలో తప్పిదాలు జరిగాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో పౌర సరఫరాల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్‌ సామర్థ్యం, బియ్యం నాణ్యతపై అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘పౌర సరఫరాల శాఖ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ శాఖ రూ.56వేల కోట్ల నష్టంలో కొనసాగుతోంది. 12 శాతం మంది వినియోగదారులు రేషన్‌కార్డులు ఉపయోగించలేదు. రేషన్‌ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలి. మిల్లర్ల సమస్యలపైనా అధికారులతో చర్చించాం. కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ప్రజలకు అవినీతిలేని పారదర్శకమైన పాలన అందిస్తాం. వంద రోజుల్లో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ హామీని అమలు చేస్తాం’’ అని ఉత్తమ్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని