YS Jagan: ఏం జరిగిందో దేవుడికే ఎరుక
‘ఫలితాలు చూస్తే నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇలా వస్తాయని ఊహించలేదు. ఎవరో మోసం చేశారనో, ఎవరో అన్యాయం చేశారనో అనొచ్చు. కానీ వాటికి ఆధారాల్లేవు. ఏం జరిగిందో దేవుడికే తెలుసు. నేను చేయగలిగేదేమీ లేదు’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు.
ఎవరో మోసం, అన్యాయం చేశారనడానికి ఆధారాల్లేవు
ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు
పథకాల ప్రభావం ఏమైందో తెలియదు
ప్రజల తీర్పును స్వీకరిస్తున్నాం
ఎన్డీయే నేతలకు శుభాకాంక్షలు
ఫలితాల అనంతరం సీఎం జగన్
ఈనాడు, అమరావతి: ‘ఫలితాలు చూస్తే నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇలా వస్తాయని ఊహించలేదు. ఎవరో మోసం చేశారనో, ఎవరో అన్యాయం చేశారనో అనొచ్చు. కానీ వాటికి ఆధారాల్లేవు. ఏం జరిగిందో దేవుడికే తెలుసు. నేను చేయగలిగేదేమీ లేదు’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా తీర్పును స్వీకరిస్తున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎంపికచేసిన కొంతమంది విలేకరులతో జగన్ మాట్లాడారు. ‘అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు, మంచిచేసి వాళ్ల పిల్లలు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. వారి ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మేలుచేసి, సాయాన్ని వారి ఇంటికే పంపే వ్యవస్థను తీసుకొచ్చినా, వాళ్లు చూపిన ఆప్యాయత ఏమైందో తెలియదు. 1.05 కోట్ల మంది పొదుపు సంఘాల మహిళలకు అన్నివిధాలా అండగా ఉన్నాం. వారి ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. చేయూత అందుకుంటున్న 26 లక్షల మంది మహిళల ఆప్యాయత ఏమైందో తెలియదు. 12 లక్షల మంది పిల్లల చదువులకు పూర్తి ఫీజులు చెల్లించినా, వారి తల్లిదండ్రుల అభిమానం ఏమైందో తెలియదు.
54 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూ లేనట్లుగా పెట్టుబడి సాయం అందింది. రైతు భరోసా, సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి, పంట బీమా కల్పించి, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినా.. వారి ప్రేమ ఏమైందో తెలియదు. వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చిరు వ్యాపారులకు తోడు, రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు చేదోడు.. ఇలా కోట్ల మంది పేదలకు తోడుగా ఉన్నాం. మ్యానిఫెస్టో అంటే చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు, బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావిస్తూ.. 99 శాతం హామీలు అమలు చేశాం. పిల్లలకు ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చి వారి చరిత్ర మార్చాలని చూశాం. గ్రామస్థాయిలో సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థతో ప్రతి ఇంటికీ వివక్ష, అవినీతి లేకుండా సేవలందించాం. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో మార్పులు తెచ్చి, పేదలకు అండగా నిలబడ్డాం. మహిళా సాధికారిత, సామాజిక న్యాయమంటే ఏంటో ప్రపంచానికి చూపించాం. ఇంత గొప్ప మార్పులు చేశాక.. వారి అభిమానం, ఆప్యాయత ఏమైందో తెలియదు’ అని జగన్ పేర్కొన్నారు.
పోరాటాలు చేయడం కొత్తకాదు
‘మంచి చేయడానికి కచ్చితంగా ప్రజలకు తోడుగా ఉంటాం. గొంతులేని వారికి గొంతుక (వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్)గా ఈ పార్టీ తాను చేయాల్సింది తప్పకుండా చేస్తుంది. ఎంతచేసినా 40 శాతం మా ఓటుబ్యాంక్ను తగ్గించలేకపోయారు. కచ్చితంగా మళ్లీ గుండె ధైర్యంతో ఇక్కడి నుంచే లేస్తాం. ప్రతిపక్షంలో ఉండటం, పోరాడటం కొత్తకాదు. ఈ అయిదేళ్లు తప్ప, నా రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలోనే గడిపాను. రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలను అనుభవించా. ఇప్పుడు అంతకంటే కష్టాలు పెట్టినా ఎదుర్కొంటాం. ఓడిపోయినా సరే, నా కష్టాల్లో అండగా నిలబడిన ప్రతి నాయకుడు, కార్యకర్త, వాలంటీరుకు, ప్రతిఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా తోడుగా నిలిచిన అక్క చెల్లెమ్మలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని జగన్ తెలిపారు.
గొప్ప విజయానికి అభినందనలు
పెద్దపెద్ద వాళ్ల కూటమి, దిల్లీలో సైతం శాసించే పరిస్థితిలో ఉన్న కూటమి, అందులో ఉన్న భాజపా, చంద్రబాబు, పవన్కల్యాణ్ సాధించిన గొప్ప విజయానికి అభినందనలు తెలియజేస్తున్నట్లు జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలోకి వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. విలేకరుల సమావేశం చివర్లో మీ కొత్త పాత్ర ఎలా ఉండబోతోంది అని విలేకరులు ప్రశ్నించగా, జగన్ బదులు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. మరోపక్క ‘ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ప్రజల తరఫున పోరాడతాం. కచ్చితంగా మళ్లీ తిరిగి లేస్తామ’ని జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
సీఎం జగన్.. మంత్రుల రాజీనామా
ఆమోదించిన గవర్నర్
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్తోపాటు ఆయన మంత్రి వర్గంలోని 24 మంది మంత్రులు మంగళవారం రాజీనామా చేశారు. వీటిని గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్కు పంపగా.. ఆయన ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొనసాగాలని జగన్ను గవర్నర్ కోరారు. ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి 11 గంటల తరువాత రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం రాజపత్రం (గెజిట్) విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి