Raghav Chadha: ఆప్ కీలక నేత రాఘవ్ చద్దా ఎక్కడా..?
ఆప్ కీలక నేత రాఘవ్ చద్దా ఎక్కడా అని ఇండియా కూటమిలోని ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన నాయకుడు ప్రశ్నించారు. ఈ సమయంలో ఆయన లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందికరమన్నారు.
ఇంటర్నెట్డెస్క్: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వంటి పరిణామాలు చోటు చేసుకొన్న సమయంలో ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన రాఘవ్ చద్దా (Raghav Chadha) కనిపించలేదు. ఈ విషయాన్ని ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన ప్రతిపక్ష ఉపనేత జితేంద్ర అవ్హద్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో సభ్యులు కావడం గమనార్హం.
‘రాఘవ్ చద్దా ఎక్కడ..?’ అని శనివారం ఎక్స్ వేదికగా జితేంద్ర అవ్హద్ అడిగారు. ఆ తర్వాత సదరు పోస్టును తొలగించారు. ఆయన ఈ పోస్టు చేయడానికి ముందు ఆప్ నేత ఆతిశీ చురుగ్గా పార్టీ వ్యవహారాల్లో కనిపించడంపై మాట్లాడారు. అదే సమయంలో రాఘవ్ ఆ పార్టీకి విలువైన నాయకుడని పేర్కొన్నారు. ‘‘ఆప్లోని అందరు నేతలు తెరపైకి వస్తున్నారు. ఆ పార్టీకి ముఖ చిత్రం వంటి రాఘవ్ చద్దా మాత్రం కనిపించడంలేదు. ఆయన గైర్హాజరీ పార్టీ కార్యకర్తలను బాధిస్తోంది. రోజుల తరబడి కనిపించకపోవడం ప్రజలతో దూరాన్ని పెంచుతుంది. అతడు లండన్లో ఉన్నాడు. అందుకే మాట్లాడలేకపోయి ఉండొచ్చు. వీడియో సందేశం విడుదల చేస్తే బాగుండేది. ఆయన గైర్హాజరీపై మేము ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం’’ అని ఓ ఆంగ్ల వార్తాపత్రిక వద్ద వ్యాఖ్యానించారు.
రాఘవ్ చద్దా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడు. మార్చి తొలి వారంలో నేత్ర వైద్యం నిమిత్తం లండన్ వెళ్లారు. నాటి నుంచి అక్కడే ఉండిపోయారు. ఎప్పుడు భారత్కు వస్తారో స్పష్టత లేదు. లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.