Gujarat Elections: ఒకప్పటి పోరాట యోధులు.. ఇప్పుడు కనిపించని ఆ ముగ్గురు!
గుజరాత్లో 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేశ్ మేవానీ పేర్లు బలంగా వినిపించాయి. ఈ ముగ్గురూ ప్రస్తుతం రాజకీయాల్లోనే ఉన్నా.. అప్పటి పోరాట స్ఫూర్తి మాత్రం కనుమరుగైంది.
‘‘యువతలో పోరాట స్ఫూర్తి సన్నగిల్లుతోంది. యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుంది.’’ - దాదాపు ప్రతి రాజకీయ నాయకుడి ప్రసంగంలో వినిపించే సూక్తి వచనాలివీ. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులను చూసిన వారికి మాత్రం ఈ మాటలు నమ్మశక్యంగా అనిపించవు. ఎందుకంటే మోదీ, అమిత్షా తప్ప మరే పేరూ వినిపించని గుజరాత్లో.. అప్పట్లో ఓ మూడు పేర్లు బలంగా వినిపించాయి. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా చేశాయి. వారే.. హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేశ్ మేవానీ. వేర్వేరు సామాజిక నేపథ్యాలు.. వేర్వేరు ఉద్యమ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ముగ్గురూ.. అనూహ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలపై తమదైన ముద్ర వేశారు. భాజపా ఏకఛత్రాధిపత్యానికి దాదాపు బ్రేకులు వేశారు. పూర్తిగా విజయాన్నైతే అడ్డుకోలేకపోయినా.. దేశం చూపును తమవైపు చూపు తిప్పుకునేలా చేశారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలుగానూ గెలుపొందారు. అనంతరం వివిధ సందర్భాల్లో అందరూ కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు మాత్రం జిగ్నేశ్ మినహా మిగిలిన ఇద్దరూ భాజపాలో చేరి ఎన్నికల బరిలో నిలిచారు. కానీ అప్పటికీ ఇప్పటికీ ఒకటే తేడా! అప్పుడు పోరాట యోధులుగా ఉన్న ఆ ముగ్గురూ.. ఇప్పుడు కేవలం ఎన్నికల బరిలో నిలిచిన సాధారణ అభ్యర్థులుగా మారిపోయారు. అంతలా ఆ మూడు పేర్లూ వినిపించకుండా పోయాయి. ఒకవేళ ఈసారి ఎన్నికల్లో గెలిస్తే మరో ఐదేళ్లు ఆ రాష్ట్ర ప్రజలు వారి గురించి మాట్లాడుకుంటారేమో గానీ.. ఓడితే మాత్రం వారి గురించి చర్చించే వారే ఉండరేమో!!
నూనుగు మీసాల వయసులోనే సంచలనం
హార్దిక్ అనగానే ఇప్పుడైతే అందరికీ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గుర్తొస్తాడు. అదే 2017 ఎన్నికలకు ముందు మాత్రం హార్దిక్ అంటే పటీదార్ ఆందోళన సమితి (పాస్)కి నేతృత్వం వహించిన హార్దిక్ పటేలే గుర్తొచ్చేవారు. అంతలా దేశం దృష్టిని ఆకర్షించాడీ పటీదార్ ఉద్యమ నేత. పటీదార్లకు రిజర్వేషన్ కోరుతూ 2015లో అహ్మదాబాద్ వీధుల్లో 5 లక్షల మందితో ఉద్యమం జరిగింది. దానికి నేతృత్వం వహించారు హార్దిక్ పటేల్. అప్పటికి హార్దిక్ వయసు 20 ఏళ్లే. హార్దిక్ దెబ్బకు అప్పటి ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించి పటీదార్లు, బ్రాహ్మణులు, బనియన్లకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు పదుల వయసులో ప్రభుత్వాన్ని కదిలించిన హార్దిక్ను తర్వాతి కాలంలో అల్లర్ల కేసులు వేధించాయి. దీంతో రాజకీయ మద్దతు అవసరం అయ్యింది. అలా 2019 లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. కేసుల కారణంగా ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తర్వాతి కాలంలో కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. పలు రాష్ట్రాల ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్గానూ వ్యవహరించారు. కారణాలు తెలీనప్పటికీ అనూహ్యంగా కాంగ్రెస్కు రాజీనామా చేసి భాజపాలో చేరారు. దీంతో విరాగమ్ సీటు నుంచి అతడిని ఈసారి భాజపా బరిలో దింపింది. అందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే తేజశ్రీ పటేల్ను సైతం పోటీ నుంచి తప్పించింది. దీంతో ఒకప్పుడు ఏ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారో ఇప్పుడు అదే పార్టీ నుంచి ఓ అభ్యర్థిగా బరిలో నిలిచారు హార్దిక్. జస్ట్ ఓ అభ్యర్థిగా!
‘అల్పేష్’ ఠాకూర్
2017లో భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన యువ నాయకుల్లో అల్పేష్ ఠాకూర్ ఒకరు. ఐదేళ్లు గడిచింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే భాజపా నుంచి గాంధీనగర్ (సౌత్) స్థానానికి పోటీ చేస్తున్నారు. అదీ ఓ సాధారణ అభ్యర్థిగా! భాజపాకు బలమైన స్థానంలో గెలుస్తానో లేదోనన్న సంకోచంతో!! 2016లో మద్యపానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని లేవనెత్తారు అల్పేష్ ఠాకూర్. పటీదార్ ఆందోళనకు వ్యతిరేకంగా ఓబీసీ-ఎస్టీ-ఎస్సీ ఏక్తా మోర్చా పేరిట నడిచిన ఉద్యమానికీ అల్పేష్ నేతృత్వం వహించారు. గుజరాత్ క్షత్రియ సేనను స్థాపించడమే కాకుండా రాష్ట్రంలో ఓబీసీ కమ్యూనిటీ నుంచి బలమైన నేతగా అవతరించారు. 2017 ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరి పఠాన్ జిల్లాలోని రధన్పూర్ స్థానం నుంచి గెలుపొందారు. కానీ 2019 లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో అన్ని పదవులకూ రాజీనామా చేశారు. అదే ఏడాది భాజపాలో చేరారు. అనంతరం రధన్పూర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రఘు దేశాయ్ చేతిలో ఓటమి చవిచూశారు. ఇప్పుడు భాజపా తనకు తిరుగులేదూ అనుకుంటున్న గాంధీనగర్ (సౌత్) స్థానం నుంచి అల్పేష్ను బరిలో నిలిపింది. అయితే, ఇక్కడి స్థానిక నాయకత్వం ఆయనకు సహకరించడం లేదని తెలుస్తోంది. దీంతో ఒకప్పటి ఉద్యమ నేత ఇప్పుడు విజయం కోసం పరితపించాల్సిన పరిస్థితి.
జిగ్నేశ్ కాంగ్రెస్ నుంచి..
దళిత యువకులపై దాడులను వ్యతిరేకిస్తూ గుజరాత్లో ఎదిగిన నేత జిగ్నేశ్ మేవానీ. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రమే కాదు.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. దళితులపై దాడులను నిరసిస్తూ 2017 ఎన్నికలకు ముందు భాజపాకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తుల్లో జిగ్నేశ్ ఒకరు. ఆ ఎన్నికల్లో వాద్గాం సీటు నుంచి స్వతంత్రుడిగా పోటీ చేశారు. జిగ్నేశ్ విజయానికి అప్పట్లో కాంగ్రెస్ సహకరించింది. పోటీలో పార్టీ అభ్యర్థిని పెట్టకుండా అతడి విజయానికి దోహదపడింది. అనంతరం కాంగ్రెస్లో చేరిన జిగ్నేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడూ అదే వాద్గాం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్నారు. ఆ మధ్య గాడ్సేపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై జిగ్నేశ్ మేవానీ అరెస్టయ్యారు. అస్సాంలోని కోక్రాఝార్లో భాజపా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు జిగ్నేశ్ మేవానీని గుజరాత్లో అరెస్టు చేసి తీసుకెళ్లారు. 2017 ఎన్నికల తర్వాత ఈ ఒక్క సందర్భం మినహా జాతీయ స్థాయిలో మాత్రం జిగ్నేశ్ పేరు వినిపించ లేదంటే అతిశయోక్తి కాదు.
మొత్తానికి ఒకప్పుడు జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించిన ఈ ముగ్గురి భవితవ్యం త్వరలో తేలనుంది. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతలుగా గుజరాత్ అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో?
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.