Modi 3.0 Cabinet: క్యాబినెట్ కూర్పుపై ఉత్కంఠ
ప్రధానమంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చకచకా జరుగుతున్నాయి. ఎన్డీయే తరఫున తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా దిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్హాల్లో శుక్రవారం ఉదయం సమావేశం కానున్నారు.
9వ తేదీ సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణస్వీకారం!
నేడు ఎన్డీయే ఎంపీల భేటీ
తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ
హోం, ఆర్థిక, రక్షణ శాఖలు భాజపాకే!
3 బెర్తులు దక్కొచ్చంటున్న తెదేపా వర్గాలు
బిహార్కు ప్రత్యేక హోదా కోరనున్న జేడీయూ?
ఈనాడు - దిల్లీ
ప్రధానమంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చకచకా జరుగుతున్నాయి. ఎన్డీయే తరఫున తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా దిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్హాల్లో శుక్రవారం ఉదయం సమావేశం కానున్నారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. విస్తృత స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గురువారం రాత్రే హస్తిన చేరుకున్నారు. ఎన్డీయే ఎంపీల భేటీలో 240 మంది భాజపా ఎంపీలతోపాటు తెదేపా, జేడీయూ, శివసేన, లోక్జన్శక్తి (రాంవిలాస్), ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీయే పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ వారంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. అనంతరం చంద్రబాబు, బిహార్ సీఎం నీతీశ్కుమార్ సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమవుతారు. ఎన్డీయేకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖలను సమర్పిస్తారు. తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతారు. ఎన్డీయేకు సంపూర్ణ మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఆయన్ను సర్కారు ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానించడం లాంఛనమే.
ఆదివారం సాయంత్రం 6గంటలకు మోదీ తన మంత్రివర్గ సభ్యులతో సహా ప్రమాణం చేసే అవకాశముంది.
మంత్రి పదవుల కేటాయింపు ఎలా?
రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్సభ సంఖ్యాబలంలో 15% వరకు మంత్రివర్గంలో సభ్యులు ఉండొచ్చు. అంటే- ప్రస్తుతం 81 మందిని అమాత్యులుగా తీసుకోవచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం భాజపాకు సొంతంగా లేదు. కాబట్టి గత రెండు దఫాలతో పోలిస్తే మిత్రపక్షాలకు ఈసారి ప్రాధాన్యం పెరిగే అవకాశాలున్నాయి. మిత్రపక్షాల సంఖ్యాబలం ఆధారంగా ప్రధానమంత్రి వాటికి మంత్రి పదవులు కేటాయిస్తారా? లేదంటే మరేదైనా కొత్త ఫార్ములా అనుసరిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. గత రెండు పర్యాయాలు మిత్రపక్షాలకు పౌర విమానయానం, ఉక్కు, ఆహారశుద్ధి, భారీ పరిశ్రమల వంటి శాఖలనే భాజపా కేటాయించింది. గతంలో సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రైల్వే, టెలికాం, వాణిజ్యం, నౌకాయానం వంటి కీలక శాఖలను మిత్రపక్షాలకు ఇచ్చిన సందర్భాలున్నాయి. మరోవైపు టాప్-4గా చెప్పుకొనే హోం, ఆర్థికం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను భాజపా తన వద్దే ఉంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలోని 22 మంది సార్వత్రిక సమరంలో ఓడిపోయారు. ఎన్నికలకు ముందే 10 మంది మంత్రులు వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి కేంద్రమంత్రివర్గం కొత్తవారితో సరికొత్త రూపు సంతరించుకొనే అవకాశముంది. శివసేన (శిందే వర్గం) తరఫున తన కుమారుడు, మూడుసార్లు ఎంపీ శ్రీకాంత్ శిందేను కాకుండా ఇతర సీనియర్ ఎంపీలను మంత్రి పదవుల కోసం పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే భాజపాకు సూచించినట్లు సమాచారం.
రాష్ట్ర ప్రయోజనాలకే చంద్రబాబు పెద్దపీట
ప్రస్తుతం ఎన్డీయేలో భాజపా తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలున్నది తెదేపాకే. ఆ పార్టీ సభ్యులకు మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కుతుందనే అంచనాలున్నాయి. అయితే చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారని తెదేపా వర్గాలు గుర్తుచేస్తున్నాయి. మంత్రి పదవుల కేటాయింపు విషయాన్ని మోదీ నిర్ణయానికే వదిలిపెట్టి.. భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఆయన ఒత్తిడి తెచ్చేందుకు ఆస్కారం అధికంగా ఉందని పేర్కొంటున్నాయి. గతంలో తెదేపా వాజ్పేయీ ప్రభుత్వంలో చేరకుండా స్పీకర్ పదవికే పరిమితమైన విషయాన్నీ గుర్తుచేస్తున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వడం 2014-18 మధ్య మోదీ చూశారని, ఎన్డీయే నుంచి బయటికొచ్చిన తర్వాత కూడా భాజపా నేతలు ఆ విషయాన్ని పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారని తెదేపా నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు మరోసారి అదే పంథాను అనుసరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈసారి ఆయన అమరావతి, పోలవరం నిర్మాణంతోపాటు రాష్ట్రానికి మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఒత్తిడి చేయడానికి వెనుకాడబోరని వివరిస్తున్నారు. అందుకే మంత్రి పదవుల కోసం తన అమ్ములపొదిలోని అస్త్రాలను వృథా చేసుకోరని చెబుతున్నారు. తెదేపాకున్న సంఖ్యాబలాన్ని బట్టి మూడు దాకా మంత్రి పదవులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు- బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని భాజపాను జేడీయూ డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భాజపా అగ్రనేతల భేటీ
అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితర భాజపా అగ్రనేతలు దిల్లీలో గురువారం తమ పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఇంట్లో సమావేశమయ్యారు. మిత్రపక్షాలకు కేంద్ర మంత్రి పదవుల పంపకంపై సమాలోచనలు జరిపారు. స్వపక్షంలో ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకోవాలన్నదానిపై చర్చించారు. బి.ఎల్.సంతోష్, సురేష్ సోని, అరుణ్కుమార్, దత్తాత్రేయ హొసబళె తదితర నేతలూ ఇందులో పాల్గొన్నారు.
మోదీ ప్రమాణ స్వీకారానికి విచ్చేయనున్న వివిధ దేశాల అధినేతలు!
మోదీ ప్రమాణస్వీకార వేడుకకు పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్ల పాలకులు ఆదివారం జరగనున్న ఈ కార్యక్రమానికి తరలివచ్చే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె ఇప్పటికే తమ రాకను ఖరారు చేసినట్లు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి