BJP: కమలం ప్రయోగం వికటించిందా..?
2024 ఎన్నికలు భాజపాకు అతిపెద్ద షాక్గా నిలిచాయి. 2004 నాటి ఫలితాలు పునరావృతం కాకపోయినా.. ఆ పార్టీ పార్లమెంట్లో సొంతంగా మెజార్టీని కోల్పోయి కూటమి పక్షాలపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా అత్యధిక సీట్లున్న రాష్ట్రాల్లో భారీగా నష్టపోవడం అవకాశాలను దెబ్బతీసింది.
సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా భాజపా 370 సీట్లు సాధిస్తుందని చెప్పిన ఆ పార్టీకి ఇప్పుడు చుక్కెదురైంది. గతం కంటే కనీసం 60కిపైగా సీట్లు తక్కువ వచ్చాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ (80), పశ్చిమ బెంగాల్ (42) మహారాష్ట్ర (48), కర్ణాటక (28), బిహార్ (39), రాజస్థాన్ (25) రాష్ట్రాల్లో గతం కంటే సీట్లను కోల్పోయింది. ఒడిశాలో రాణించినా.. తమిళనాడులో అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఫలితంగా భాజపా సొంతంగా మెజార్టీ సాధించలేని పరిస్థితి నెలకొంది. ఈమేరకు ఇండియా కూటమిలో కాంగ్రెస్కు 99, సమాజ్వాదీ పార్టీకి 36 సీట్లతో భారీగా లబ్ధి చేకూరింది.
అభ్యర్థుల ఎంపికలో తప్పు జరిగిందా..?
ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకొనేందుకు ఏకంగా 112 మంది సిట్టింగ్లకు టికెట్లను నిరాకరించింది. గత ఎన్నికల్లో లక్ష నుంచి 6 లక్షల వరకూ మెజారిటీతో గెలుపొందిన 39 మంది అభ్యర్థులను మార్చేసింది. టికెట్లు కోల్పోయిన వారి సగటు గెలుపు మెజార్టీ 2,35,111లు కాగా.. కొనసాగించిన 168 మంది సగటు మెజార్టీ 2,23,686 ఓట్లు కావడం విశేషం. ఫలితాలను చూస్తే భాజపా బలమైన అభ్యర్థులను వదులుకొందా అనే సందేహం రాకమానదు. బీఫారం కోల్పోయిన వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయరన్న గ్యారెంటీ లేదు. రాహుల్ కస్వా వంటి వారు దీనికి ఉదాహరణ.
కూటమిలో అతిపెద్ద నష్టం భాజపాకే..
కమలం పార్టీ ఈసారి 441 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఎన్డీఏ మిత్రపక్షాలు మొత్తం 540 సీట్లలో పోటీ చేశాయి. ఈ కూటమిలో అత్యధికంగా భాజపానే 2019తో పోలిస్తే 20శాతానికి పైగా సీట్లను కోల్పోయింది. గత ఎన్నికల్లో 303 సీట్లను సాధించిన కమలం పార్టీ ఈసారి సొంత మెజార్టీకి దిగువనే సర్దుకోవాల్సి వచ్చింది. కూటమిలోకి తిరిగి పునరాగమనం చేసిన తెదేపా గతంతో పోలిస్తే అదనంగా 12 సీట్లు లబ్ధి పొందింది.
హిందీ బెల్ట్లో గతి తప్పి..
దేశ వ్యాప్తంగా అత్యధిక సీట్లున్న పెద్ద రాష్ట్రాల్లో భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మినహా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్రంగా దెబ్బతింది. ఇది మొత్తంగా భాజపా సీట్ల సంఖ్యపై ప్రతికూల ప్రభావం చూపింది. యూపీలో 2019లో 64 సీట్లను గెలుచుకోగా.. ఈసారి దాదాపు 30 స్థానాలను కోల్పోయింది.
* ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో భాజపా విజయం సాధించిన రాజస్థాన్లో పార్లమెంట్కు వచ్చేసరికి దాదాపు భారీగా సిట్టింగ్ సీట్లు పార్టీ కోల్పోయింది. 2019లో ఇక్కడ క్లీన్ స్వీప్ చేసిన కమలదళం ఈసారి 14కు పరిమితమైంది.
* ఇక మరో పెద్ద రాష్ట్రమైన బిహార్లో గత ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన 39 సీట్లలో ఒంటరిగా 17 భాజపానే సాధించింది. కానీ, ఈసారి కమలం పార్టీకి 5 తగ్గి 12 సీట్లకు పడిపోగా.. మిత్రపక్షమైన జేడీఎస్ (ఎస్)కు కూడా రెండు స్థానాల్లో నష్టం చేకూరింది. మొత్తం మీద ఇక్కడ కూటమి 30 స్థానాలు సాధించింది.
దీదీ అడ్డాలో కూడా ఎదురుదెబ్బే..
భాజపా ఈసారి గణనీయంగా పుంజుకొంటుందని భావించిన పశ్చిమబెంగాల్లో కూడా కమలం పార్టీ కనీసం 6 సీట్లను కోల్పోయింది. గతంలో 18చోట్ల గెలవగా.. ఈ సారి 12తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఒక సీటు కోల్పోయింది. ఇవి మొత్తం తృణమూల్ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి.
కన్నడనాట ఆధిక్యం కోల్పోయి..
భాజపాకు దక్షిణాదిన బలమైన పట్టున్న రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ మొత్తం 28 సీట్లుండగా.. గతంలో ఎన్డీఏ 26 గెలుచుకొంది. ఇటీవల జేడీఎస్ కూడా చేరడంతో ఆ బలం 27కు పెరిగింది. కానీ, 2024 ఎన్నికల ఫలితాల్లో మాత్రం భాజపా మిత్రపక్షాల బలం 19కే పరిమితమైంది. మిత్రపక్షమైన జేడీఎస్ గతంలో కంటే ఒక సీటు అదనంగా గెలుచుకోవడమే ఇక్కడ ఊరట.
మహారాష్ట్రలో ముడుచుకుపోయిన కమలం..
మహారాష్ట్రలో కూడా గత ఎన్నికలతో పోలిస్తే ఎన్డీఏ తీవ్రంగా దెబ్బతింది. 2019లో అక్కడ 41 సీట్లలో కూటమి విజయం సాధించింది. వీటిల్లో భాజపాకు 23.. శివసేనకు 18 స్థానాలు వచ్చాయి. కానీ, ఈసారి చీలిన పార్టీలతో కూటమి కట్టి.. 18 వద్దే ఆగిపోయింది.
హరియాణాలో సగానికి సగం..
2019 ఎన్నికల్లో హరియాణాలో 10 స్థానాల్లో భాజపా క్లీన్స్వీప్ చేయగా.. ఈసారి మాత్రం బలం 5కు పడిపోయింది. ఇక్కడ హస్తం భారీగా పుంజుకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్