Loksabha Elections: హేమాహేమీలకే దక్కని విజయం.. తరణ్జీత్ సొంతమయ్యేనా?
స్వర్ణదేవాలయానికి నిలయమైన అమృత్సర్ లోక్సభ నియోజకవర్గంలో ఎలాగైనా విజయం సాధించాలని భాజపా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. జాట్ సిక్కు ఓటర్లను ఆకర్షించేలా అదే సామాజిక వర్గానికి చెందిన తరణ్జీత్ సంధూను బరిలోకి దింపింది.
ఇంటర్నెట్ డెస్క్: గత రెండు పర్యాయాలుగా దేశ వ్యాప్తంగా మోదీ (PM Modi) గాలి వీస్తున్నా.. అక్కడ హస్తానిదే పైచేయి. భాజపా నుంచి హేమాహేమీలు బరిలోకి దిగుతున్నా విజయం మాత్రం కాంగ్రెస్దే. అదే స్వర్ణదేవాలయానికి నిలయమైన పంజాబ్లోని అమృత్సర్ (Amritsar Lok Sabha constituency) లోక్సభ నియోజకవర్గం. భాజపా శనివారం రాత్రి అభ్యర్థులను ప్రకటించిన 11 స్థానాల్లో ఇదొకటి. అమెరికాలో భారత రాయబారిగా పని చేసిన తరణ్జీత్ సింగ్ సంధూ (Taranjit singh Sandhu) బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్కు మంచి పట్టున్న ఈ స్థానంలో తరణ్జీత్ విజయం నల్లేరు మీద నడక కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 20 సార్లు ఎన్నికలు నిర్వహించగా.. కేవలం 5 సార్లు మాత్రమే భాజపా విజయం సాధించింది. 2004-2009 మధ్య కాలంలోనే 3 సార్లు ఎన్నికలు జరగ్గా.. భాజపా తరఫున నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ గెలుపొందారు.
జైట్లీ, పూరిలకు తప్పని పరాభవం
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున దివంగత అరుణ్ జైట్లీ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సిక్కుల అభిమానాన్ని చూరగొనేందుకు కాషాయ దళం హర్దీప్ సింగ్ పూరిని ఈ స్థానం నుంచి బరిలోకి దింపింది. ఆయన కూడా ఘోర పరాభవాన్ని చవి చూశారు. స్థానిక కాంగ్రెస్ నేత గుర్జీత్ సింగ్ ఔజలా చేతిలో ఓటమిపాలయ్యారు. ఇటీవల పార్లమెంట్లో గందరగోళం చోటు చేసుకున్న సమయంలో ఔజలా పేరు బాగా వినిపించింది. గ్యాలరీ నుంచి కిందకి దూకిన ఇద్దరు నిందితులను ఈయన, మరో ఎంపీ పట్టుకొని అక్కడి సిబ్బందికి అప్పగించారు. రాజకీయ వర్గాల్లో ఈయన్ని ‘సింగ్ ఈజ్ కింగ్’ అని పిలుస్తారు.
తరణ్జీత్ మూలాలు ఇక్కడివే..
అరుణ్ జైట్లీ, హర్దీప్ సింగ్ పూరి లాంటి కీలక నేతలు బరిలోకి దిగి ఓటమి చెందిన స్థానంలో తరణ్జీత్ నిలదొక్కుకొని ఎలా విజయం సాధిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు తనకు టికెట్ కేటాయించడానికి ముందు నుంచే అమృత్సర్లో గత కొన్నాళ్లుగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యేందుకు తరణ్జీత్ ప్రయత్నిస్తున్నారు. స్థానికేతరుడని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఆయన పంజాబ్ మూలాలు కలిగిన వ్యక్తే. ఆయన పూర్వీకులు ఇక్కడే పుట్టిపెరిగారు. సిక్కుల మినీ పార్లమెంట్గా వ్యవహరించే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) వ్యవస్థాపక సభ్యుల్లో తరణ్జీత్ తాత సర్దార్ తేజా సింగ్ సముంద్రి ఒకరు. ఆయన తండ్రి గురునానక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పని చేశారు. శిరోమణి అకాళీదళ్ పార్టీ రాజకీయ మనుగడకు కేంద్ర బిందువు ఎస్జీపీసీయేనని చెబుతారు.
భారత రాయబారిగా సేవలు
ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన తరణ్సింగ్.. 1988 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు ఎంపికై ఉక్రెయిన్, శ్రీలంక, అమెరికాలో భారత రాయబారిగా సేవలందించారు. ఇటీవల భారత్- కెనడా మధ్య చోటుచేసుకున్న దౌత్యసంబంధమైన సమస్య పరిష్కారానికి విశేష కృషి చేశారు. అమృత్సర్లో విజయం సాధించాలంటే జాట్ సిక్కు వర్గానికి చెందిన తరణ్జీత్ సరైన వ్యక్తి అని భాజపా అధిష్ఠానం గట్టిగా నమ్ముతోంది. అంతేకాకుండా ఆయన కుటుంబ నేపథ్యం, దార్శనికతే విజయం దిశగా అడుగులు వేయిస్తాయని స్థానిక నేతలు అంటున్నారు. ఈ స్థానానికి చివరి విడతగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. మరోవైపు భాజపా తాజా జాబితాలో పంజాబ్లోని పటియాలా నుంచి మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్, లుథియానా నుంచి మరో మాజీ సీఎం బియాంత్ సింగ్ మనవడు రవ్నీత్ సింగ్, గుర్దాస్పుర్ నియోజకవర్గంలో నుంచి సినీనటుడు సన్నీ దేవోల్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే రాకుడ్ దినేశ్ సింగ్ చోటు దక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి