Yamini: విశాఖలో డ్రగ్స్.. ఈ ఘటన దేశాన్నే కుదిపేసింది: సాధినేని యామిని
విశాఖలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడిన ఘటన రాష్ట్రాన్నే కాకుండా దేశాన్నే కుదిపేసిందని భాజపా నేత సాధినేని యామినీశర్మ అన్నారు.
విజయవాడ: విశాఖలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడిన ఘటన రాష్ట్రాన్నే కాకుండా దేశాన్నే కుదిపేసిందని భాజపా నేత సాధినేని యామినీశర్మ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు, నార్కోటిక్స్ విభాగం డ్రగ్స్ సరఫరాను అరికట్టకుండా నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని.. మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. వీటి వల్లే మహిళలపై నేరాలు, దాడులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు.
కూనం వీరభద్రరావుకు చెందిన సంస్థ సంధ్య ఆక్వా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో విశాఖకు కంటెయినర్ వచ్చిందని యామిని అన్నారు. ఆయనకు వైకాపాతో సంబంధాలున్నాయని ఆరోపించారు. అతడి సోదరుడు కూడా ఆ పార్టీ నాయకుడేనని చెప్పారు. ఇదంతా కప్పిపుచ్చుకునేందుకు భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైకాపా నేతలు అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోతామని తెలిసినా అధికార పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పురందేశ్వరిపై అసత్య ఆరోపణలు మానుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
ఐదేళ్లలో ఎస్సీల సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. -
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
జగన్ ఫొటోలు ఉన్న పాసు పుస్తకాల నకళ్ల దహనానికి తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. పద్మవిభూషణ్ పురస్కారం అందుకుని దిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. -
జనసేనకు వంగ లక్ష్మణ్గౌడ్ రాజీనామా
జనసేన తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగ లక్ష్మణ్గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం తాజ్కృష్ణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
-
కడపలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు
-
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
-
ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా