YS Jagan: పరదాల పహిల్వాన్.. పెవిలియన్కు!
జగన్ తనకు తానే భస్మాసుర హస్తమయ్యారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అపూర్వ విజయాన్ని ప్రజలు 2019లో అందిస్తే.. హుందాగా స్వీకరించి ప్రజారంజక పాలన అందించి, అందరి మన్నన చూరగొనాల్సింది పోయి.
విద్వేషం.. విధ్వంసంతో ఓటమికి బాటలు
అంతా నేనే.. అనే అహంకార ధోరణి
ఎమ్మెల్యేలు, ఎంపీలనూ డమ్మీలుగా మార్చిన వైనం
జగన్ను చూసే జనం ఓటేస్తారంటూ గొప్పలు
ఈనాడు, అమరావతి: జగన్ తనకు తానే భస్మాసుర హస్తమయ్యారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అపూర్వ విజయాన్ని ప్రజలు 2019లో అందిస్తే.. హుందాగా స్వీకరించి ప్రజారంజక పాలన అందించి, అందరి మన్నన చూరగొనాల్సింది పోయి.. అధికారంతో విర్రవీగితే జనం ఎలా ఓటుతో బుద్ధి చెబుతారనేందుకు ఈ ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయమే నిదర్శనం. జగన్ రివర్స్ పాలనతో విసిగిపోయిన జనం ఆయన అధికారాన్ని ఓటుతో రీకాల్ చేశారు.
ఎన్నికల ముందు ప్రజల్లో... ఎన్నికలయ్యాక ప్యాలెస్లో...
2019 ఎన్నికల ముందు పాదయాత్రతో ప్రజల్లో తిరిగిన జగన్...ఒక్క సారి అధికారంలోకొచ్చాక ఆ జనానికి దూరమయ్యారు. తాడేపల్లిలో ప్యాలెస్కు పరిమితమై రాచరిక పాలనకు శ్రీకారం చుట్టారు. రాజకీయ అవసరాలరీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లాలకు వెళ్లాల్సి వచ్చినా పరదాల మాటున జనం కళ్లలో కూడా పడకుండా తప్పించుకుని తిరిగొచ్చారు. అయిదేళ్లూ జనం వచ్చి తమ సమస్యలపై ముఖ్యమంత్రికి చెప్పుకొనే అవకాశాన్నే కల్పించలేదు. ‘స్పందన’పేరుతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తానంటూ అధికారంలోకొచ్చినప్పటి నుంచి అదిగో ఇదిగో అంటూ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం, తర్వాత వదిలేయడం, ఇదీ జనం పట్ల జగన్కు ఉన్న చిత్తశుద్ధి.
తాను భగవత్ స్వరూపుడా?
తానేదో భగవంతుడి స్వరూపుడినన్నట్లుగా...పథకాలను తానే సృష్టించి జనానికి ఉదారంగా ఇచ్చేస్తున్నా అన్నట్లుగా వాటన్నిటికీ తన పేరు పెట్టుకున్నారు. జనం సొమ్ముతో వ్యక్తిగత ప్రచారాన్ని చేసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఇచ్చే కోడి గుడ్లపైన కూడా ‘జగనన్న గోరుముద్ద’ అని రాయించారు. తెదేపా హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లకు 2019లో అధికారంలోకి రాగానే రూ.1,300 కోట్లకు పైగా ఖర్చు చేసి తన పార్టీ రంగులు వేయించారు. కోర్టులు మొట్టికాయలు వేయడంతో వాటిని మార్చేందుకు మరో రూ.1000 కోట్లకు పైగా ఖర్చుపెట్టారు. భూముల పట్టాదారు పాసుపుస్తకాలపైన, చివరికి సర్వే రాళ్లపైనా తన ఫొటోలు వేయించడం జగన్కే చెల్లింది.
ఆంధ్రా ‘కిమ్’గా...
అధికారం చేపట్టిన వెంటనే కరకట్టపై ఉన్న ‘ప్రజావేదిక’ను కూల్చడంతో మొదలైన జగన్ ధ్వంస రచన అయిదేళ్లూ కొనసాగింది. తన దారికొస్తే సరేసరి..లేదంటే ఎవరి ఆస్తులనైనా కూల్చడమే పాలన అన్నట్లుగా ఆయన పనిచేశారు. దారికి రాని వారిపై కేసులూ మోపారు. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టు చేయించి హింసించిన ఘనతా జగన్కే దక్కింది. అచ్చెన్నాయుడు, అయన్నపాత్రుడు లాంటి తెదేపాకు చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రుల ఇళ్లపైకి పోలీసులను ఉసిగొల్పి బీతావహ వాతావరణాన్నీ సష్టించారు. ఆయనను రాష్ట్రంలోని ప్రతిపక్షాల నాయకులు ‘ఏపీ కిమ్’ అని పిలిచే పరిస్థితి కల్పించారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ లేరు..
‘అంతా నేనే.. నేను అనుకున్నట్లే చేస్తా.. నేను ఎవరిని నిలబెట్టినా జనం ఓట్లు వేస్తారంతే.. మా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను కాదు జగన్ను చూసే జనం ఓట్లేస్తారు, నన్ను చూసి ఓట్లు వేయాలనే నేనూ చెబుతున్నా’ అని చెప్పడం ద్వారా తన ఫ్యూడల్ స్వభావాన్ని జగన్ చాటుకున్నారు. అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలను డమ్మీలుగా చూపించిన రాజకీయ నాయకుడూ ఆయనే. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను ఈ అయిదేళ్లూ పాలనలో ఎక్కడా భాగస్వాములను చేయని సీఎంగా మిగిలిపోయారు.
వ్యూహాల పేరుతో కుతంత్రాలు
2019 ఎన్నికల ముందు కోడికత్తి దాడి పేరుతో డ్రామా ఆడారు. తర్వాత ఎన్నికల ముందు మాజీ మంత్రి తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యనూ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు విపరీత ప్రచారాన్ని చేసుకున్నారు. వాటితో అప్పుడు అనుకున్న ఫలితానే సాధించారు. అదే పంథాలో ఇప్పుడూ గులకరాయి దాడి డ్రామాకు తెరతీశారు. 2019లో ఒకసారి నమ్మిన జనం..ఈసారి అస్సలు నమ్మలేదు.
మీడియాకూ దూరంగానే...
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ అయిదేళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే ప్రెస్మీట్ పెట్టి జగన్ మాట్లాడారు. అది కూడా అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తాను చెప్పినట్లుగా వినలేదనే ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకే. మాటల్లో తడబాటు కారణంగానో, తన వ్యవహారాలపై మీడియా ప్రశ్నిస్తుందన్న ఆలోచనతోనో ఇన్నాళ్లూ మీడియాను తప్పించుకుని తిరిగారు. మంగళవారం ఘోరపరాజయం తర్వాత ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడి ఫలితాలపై తన స్పందనను ప్రకటించారు.
ఓటమి ముంగిటా అదే ప్రగల్భాలు
మే 13న పోలింగ్తో తన పార్టీ పరిస్థితిపై స్పష్టత వచ్చినా..తనకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి..వారి బృందంతో మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నాం. ఈ ఫలితాలతో దేశమంతా ఏపీ వైపు చూస్తుంది’అంటూ చెప్పడం ద్వారా ఒక రకంగా తన పార్టీ కార్యకర్తలనే మోసం చేశారు. జగన్ వ్యవహారశైలి కారణంగా వైకాపాకు ఎన్నికల్లో ఇబ్బందులు రాబోతున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు ముందు నుంచి అనధికారిక చర్చల్లో వాపోతూనే ఉన్నారు. ‘ఆయనా పోతున్నాడు, మమ్మల్ని ముంచుతున్నాడు’ అని వైకాపాలో బూతుల ప్రజాప్రతినిధిగా పేరుగాంచిన ఒక ఎమ్మెల్యే తన ఆంతరంగికుల వద్ద గత కొంతకాలం నుంచే చెబుతున్నారంటేనే జగన్ తీరును అర్థం చేసుకోవచ్చు.
నేను.. నా ఈగో..
నేను..నా ఈగో..అన్న తన సహజ ధోరణినే జగన్ ఈ అయిదేళ్లూ కొనసాగించారు. ఆయన నియంత్రతృత్వ పోకడలు నచ్చక, పార్టీలో తమకు జరుగుతున్న అవమానాలను తాళలేక ఇబ్బంది పడిన పలువురు సీనియర్ నేతలు వైకాపాను వీడారు. అలాంటి నేతలను పిలిచి మాట్లాడడం కానీ, వారికున్న ఇబ్బందిని పరిష్కరించే ప్రయత్నం కానీ జగన్ చేయలేదు. తన కుటుంబానికి ఆప్తుడైన మచిలీపట్నం ఎంపీ బాలశౌరితోపాటు శ్రీకృష్ణ దేవరాయలు(నరసరావుపేట), సంజీవ్కుమార్ (కర్నూలు), వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తదితర ముఖ్య నేతలు వైకాపాను వీడినా జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడా నేతలు వారి పరిధిలో తీవ్ర ప్రభావాన్నే కనబరిచారు.
పవన్తో పోలికా..?
ప్రతిపక్ష నేతలను చులకన చేసి తాను మాట్లాడడమే కాకుండా.. తన పార్టీ నేతలతోనూ తిట్టించి ఆనందపడ్డారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కల్యాణ్ అంటూ జనసేన అధ్యక్షుడిని దారుణంగా కించపరిచారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ పవన్ను తక్కువ చేసి మాట్లాడారు. 2019లో తనకు వచ్చిన అధికారాన్ని చూసుకుని విర్రవీగిన జగన్ మాటల తీరు ఇది. అదే పవన్కల్యాణ్ పార్టీ ఇప్పుడు 21 సీట్లలో పోటీ చేసి సంపూర్ణ విజయాన్నందుకుంది. జగన్ 175 స్థానాల్లో పోటీ చేసి పట్టుమని 11 స్థానాలకే పరిమితమయ్యారు. 100 శాతం ఫలితాలు సాధించిన పవన్కు, కేవలం 6% సాధించిన జగన్కు పోలికెక్కడ మరి..?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్