YS Sharmila: రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారు: వైఎస్ షర్మిల
కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.
విజయవాడ: కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ప్రాంతీయ పార్టీల తరహాలో ఎంపిక జరగదని అన్నారు. విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. వైకాపా, తెదేపా ప్రధాని మోదీకి బానిసలుగా మారాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా, పోలవరం.. ఏ విషయంలోనూ ఏపీకి న్యాయం జరగలేదన్నారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్టేనన్నారు.
ప్రత్యేక హోదా కోసం జగన్ మూకుమ్మడి రాజీనామాలని చెప్పి డ్రామా చేశారని విమర్శించారు. 23 మంది వైకాపా ఎంపీలు ఒక్కరోజు కూడా హోదా గురించి మాట్లాడలేదన్నారు. రాష్ట్రాన్ని, ప్రజల ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తుందని, ఒక్కో మహిళకు ఏడాదికి రూ.లక్ష ఇచ్చేలా మహాలక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు. రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తూ పెట్టుబడిపై 50శాతం అధికంగా మద్దతు ధర ఇచ్చే పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వృద్ధులకు నెలకు రూ.4 వేలు పింఛను ఇస్తామని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు