YS Sharmila: రాష్ట్ర ప్రయోజనాలను జగన్‌ తాకట్టు పెట్టారు: వైఎస్‌ షర్మిల

కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల  తెలిపారు.

Updated : 30 Mar 2024 16:24 IST

విజయవాడ: కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. ప్రాంతీయ పార్టీల తరహాలో ఎంపిక జరగదని అన్నారు. విజయవాడలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కాంగ్రెస్‌ నేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. వైకాపా, తెదేపా ప్రధాని మోదీకి బానిసలుగా మారాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా, పోలవరం.. ఏ విషయంలోనూ ఏపీకి న్యాయం జరగలేదన్నారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్టేనన్నారు.

ప్రత్యేక హోదా కోసం జగన్‌ మూకుమ్మడి రాజీనామాలని చెప్పి డ్రామా చేశారని విమర్శించారు. 23 మంది వైకాపా ఎంపీలు ఒక్కరోజు కూడా హోదా గురించి మాట్లాడలేదన్నారు. రాష్ట్రాన్ని, ప్రజల ప్రయోజనాలను జగన్‌ తాకట్టు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తుందని, ఒక్కో మహిళకు ఏడాదికి రూ.లక్ష ఇచ్చేలా మహాలక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు. రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తూ పెట్టుబడిపై 50శాతం అధికంగా మద్దతు ధర ఇచ్చే పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వృద్ధులకు నెలకు రూ.4 వేలు పింఛను ఇస్తామని ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు