YS Sharmila: ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఉన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు : వైఎస్‌ షర్మిల

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు దగ్గర మనిషి అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

Published : 23 Feb 2024 12:41 IST

అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (alla ramakrishna reddy) తనకు దగ్గర మనిషి అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (ys sharmila) అన్నారు. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలన్నారు. ‘ఆళ్లపై ఉన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఆయన చెల్లిగా నేను అర్థం చేసుకోగలను. ఒక మంచి పర్సన్‌.. రాంగ్‌ ప్లేస్‌లో ఉన్నారు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మళ్లీ వైకాపాలో చేరిన విషయం తెలిసిందే. మంగళగిరిలో ఆయనను కాదని, ముఖ్యమంత్రి జగన్‌ మరొకరిని ఇన్‌ఛార్జిగా నియమించడంతో.. డిసెంబరు 11న వైకాపాకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే.. ‘ఇకపై వైఎస్‌ షర్మిల నాయకత్వంలోనే నడుస్తా’ అంటూ ఆమె సమక్షంలో జనవరి 21న కాంగ్రెస్‌లో చేరారు. నెల తిరక్కుండానే ఆ పార్టీని వీడి తిరిగి వైకాపా గూటికి చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని