Andhra news: వాలంటీర్లతో వైకాపా అభ్యర్థి సమావేశం.. పార్వతీపురంలో ఉద్రిక్తత

పార్వతీపురంలో వైకాపా అభ్యర్థి జోగారావు తన నివాసంలో వాలంటీర్లతో రహస్యంగా సమావేశం కావడం ఉద్రిక్తతకు దారి తీసింది.

Published : 14 Apr 2024 17:24 IST

పార్వతీపురం: పార్వతీపురంలో వైకాపా అభ్యర్థి జోగారావు తన నివాసంలో వాలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహించారు. విషయం తెలిసి తెదేపా అభ్యర్థి విజయ్‌చంద్ర.. జోగారావు ఇంటికి వెళ్లారు. తెదేపా శ్రేణుల రాకను గమనించిన వాలంటీర్లు అక్కడి నుంచి పరారయ్యారు. విజయ్‌చంద్ర, ఆయన అనుచరులను వైకాపా శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాలంటీర్లు పారిపోతుండగా తెదేపా కార్యకర్తలు వీడియో తీయడంతో వారి ఫోన్లను వైకాపా నాయకులు లాక్కున్నారు. విజయ్‌చంద్ర కారును అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. వైకాపా నాయకులు లాక్కున్న ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని