Palnadu: సత్తెనపల్లిలో బరితెగించిన వైకాపా నేతలు.. తెదేపా శ్రేణులపై దాడి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెద్దమక్కెనలో వైకాపా నేతలు బరి తెగించారు.

Published : 22 Apr 2024 15:41 IST

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెద్దమక్కెనలో వైకాపా నేతలు బరితెగించారు. సత్తెనపల్లి అసెంబ్లీ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్తున్న పార్టీ శ్రేణులపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. పెద్దమక్కెనలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద కాపుకాసి.. మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని