TDP: భీమిలి నియోజకవర్గంలో తెదేపాలోకి క్యూ కడుతున్న వైకాపా నేతలు
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైకాపా నాయకులు తెదేపాలోకి క్యూ కడుతున్నారు.
భీమిలి: విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైకాపా నాయకులు తెదేపాలోకి క్యూ కడుతున్నారు. ఆదివారం కుసులువాడ గ్రామ పంచాయతీ మొత్తం తెదేపాలోకి చేరగా.. తాజాగా కొవ్వాడ సర్పంచ్, ఉప సర్పంచ్ తమ అనుచరులతో కలిసి భీమిలి అసెంబ్లీ తెదేపా అభ్యర్తి గంటా శ్రీనివాసరావు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకొన్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. సీఎం జగన్ అరాచక పాలనలో విసిగి పోయిన రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు సుపరిపాలన కోసం ఎదురు చూస్తోందని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జగన్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పథకాల్లో కోతలు పెడుతూ పేద ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు.
దుక్కవానిపాలెం నుంచి..
ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ దుక్కవానిపాలెం గ్రామానికి చెందిన సీనియర్ వైకాపా నాయకుడు ఇల్లిపిల్లి ముసలయ్యను కండువా కప్పి గంటా శ్రీనివాసరావు తెదేపాలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఇన్ఛార్జి కోరాడ రాజబాబు, సర్పంచ్ లక్ష్మి, ఈశ్వరరావు, ఉప సర్పంచ్ శ్రీను పాల్గొన్నారు. మరోవైపు పద్మనాభం మండంలోని పలువురు వైకాపా నేతలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM