Tirupati: తెదేపా ఏజెంట్‌పై వైకాపా మూకల దాడి.. అడ్డొచ్చిన చిన్నపిల్లలపైనా కర్కశత్వం

వైకాపా నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రగిరి మండలం కల్‌రోడ్డుపల్లిలో ఇటీవల తెదేపా ఏజెంట్‌పై వైకాపా మూకలు దాడి చేశారు.

Updated : 06 Jun 2024 11:47 IST

తిరుపతి: వైకాపా నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రగిరి మండలం కల్‌రోడ్డుపల్లిలో ఇటీవల తెదేపా ఏజెంట్‌పై వైకాపా కార్యకర్తలు చేశారు. పోలింగ్‌ రోజు వైకాపా రిగ్గింగ్‌ను తెదేపాకు చెందిన ఏజెంట్‌ నందిపాటి త్యాగరాజు రిగ్గింగ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ మూకలు కక్షగట్టి విచక్షణారహితంగా దాడి చేశాయి. అడ్డొచ్చిన చిన్నపిల్లలు, కుటుంబ సభ్యులపైనా దాడి చేశారు. వీడియో తీస్తున్న త్యాగరాజు సోదరుడు హేమాద్రిపై దాడి చేసి మొబైల్‌ లాక్కెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని