Congress: కాంగ్రెస్‌లో చేరిన మహబూబ్‌నగర్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌

మహబూబ్‌నగర్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Published : 20 Mar 2024 13:38 IST

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కాంగ్రెస్‌లోకి నేతల వలసలు పెరిగాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి తదితరులు ఆ పార్టీలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని