Independence Day : స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ.. మెగా ఈవెంట్లలో భారత క్రీడాలోకం ఇలా..!
భారతదేశం ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. అంతర్జాతీయ క్రీడల్లో ఒలింపిక్స్.........
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశం ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. అంతర్జాతీయ క్రీడల్లో ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఐసీసీ నిర్వహించే టోర్నీలు ఎంతో విలువైనవి. వీటిల్లో మెరిసిన క్రీడా తారలు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోతారు. మరి వజ్రోత్సవాల వేళ భారత క్రీడాలోకం సాధించిన ఘనతలను ఓసారి మననం చేసుకుందాం..!
గత ఒలింపిక్స్లోనే అత్యధిక పతకాలు
దాదాపు 125 ఏళ్ల కిందట (1896) తొలిసారి ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. భారత్ మాత్రం 1900వ ఏడాదిలో ఒలింపిక్స్కు ప్రాతినిధ్యం వహించింది. రెండు సిల్వర్ పతకాలను గెలుచుకుంది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి 1948 సమ్మర్ ఒలింపిక్స్లో భారత్ పాల్గొంది. అప్పుడు కేవలం ఒకే ఒక్క స్వర్ణ పతకం వచ్చింది. అదికూడా హాకీలో కావడం విశేషం. మొత్తం ఇప్పటివరకు కేవలం 35 పతకాలను మాత్రమే సాధించింది. అందులో 10 స్వర్ణం, తొమ్మిది రజతం, 16 కాంస్య పతకాలు ఉన్నాయి. టోక్యో వేదికగా జరిగిన 2020 ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా తొలిసారి జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆ ఒలింపిక్స్లో మొత్తం ఏడు పతకాలను భారత్ దక్కించుకుంది. ఇవే భారత చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన ఒలింపిక్స్ కావడం విశేషం.
కామన్వెల్త్లో అదుర్స్..
ఇంగ్లాండ్ పాలించిన దేశాల మధ్య ప్రారంభించిన క్రీడా పోటీలే ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్గా రూపాంతరం చెందాయి. ఒలింపిక్స్లో పెద్దగా రాణించలేకపోయిన భారత అథ్లెట్లు కామన్వెల్త్ గేమ్స్లో మాత్రం అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. 1930నుంచి కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నా.. తొలిసారి భారత్ 1934 నుంచే పాల్గొంటోంది. ఇప్పటివరకు 21సార్లు కామన్వెల్త్ గేమ్స్ జరగ్గా.. భారత్ కేవలం మూడు సార్లు మాత్రమే పాల్గొనలేదు. అయితే మొత్తం 564 పతకాలను సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. అందులో 203 బంగారు, 190 రజతం, 171 కాంస్య పతకాలు ఉన్నాయి. దిల్లీ వేదికగా జరిగిన 2010 కామన్వెల్త్ గేమ్స్లో భారత్ అత్యధికంగా 101 పతకాలు దక్కించుకుని చరిత్ర సృష్టించింది. తాజాగా బర్మింగ్హామ్ వేదికగా జరిగిన గేమ్స్లోనూ ఫర్వాలేదనిపించి 61 పతకాలతో సరిపెట్టుకుంది. ఇందులో 22 స్వర్ణం, 14 సిల్వర్, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. అయితే, షూటింగ్, ఆర్చరీ క్రీడలు లేకపోవడంతో భారత్కు వచ్చే పతకాలు తగ్గిపోయాయి. అనూహ్యంగా లాంగ్జంప్, హైజంప్, క్రికెట్, జూడో, లాన్బౌల్స్ తదితర గేమ్స్లో అద్భుత ప్రదర్శనతో మన క్రీడాకారులు పతకాలు సాధించారు.
మెగా క్రికెట్ కప్లు.. మనకూ భాగస్వామ్యం
ఎన్ని ద్వైపాక్షిక సిరీస్లు గెలిచినా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రపంచకప్లను సొంతం చేసుకుంటే ఆ దర్జానే వేరు. ఇప్పటివరకు 1975నుంచి 12 సార్లు జరిగిన వన్డే ప్రపంచకప్ల్లో టీమ్ఇండియా రెండుసార్లు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 1983లో విండీస్నే ఢీకొట్టి టైటిల్ను సొంతం చేసుకుంది. కపిల్ కెప్టెన్సీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి కప్ను కొట్టడం విశేషం. అలాగే ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమ్ఇండియా 28 ఏళ్ల తర్వాత 2011లో రెండోసారి కప్ను ముద్దాడింది.
ఇక గత పదిహేనేళ్లుగా టీ20 క్రికెట్కు విపరీతమైన ఆదరణ వచ్చింది. తొలిసారి 2007లో ఐసీసీ నిర్వహించిన టీ20 ప్రపంచకప్ను భారత్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఫార్మాట్ కొత్త అయినప్పటికీ అండర్డాగ్స్గా బరిలోకి దిగిన ధోనీ సారథ్యంలోని భారత్ కప్ దక్కించుకోవడం క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇక టెస్టు ఫార్మాట్ను ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ను నిర్వహిస్తున్నారు. తొలిసారి ఫైనల్కు దూసుకెళ్లిన భారత్.. కివీస్ చేతిలో ఓటమిపాలైంది. వజ్రోత్సవం నిర్వహించుకుంటున్న ఈ ఏడాదే ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగనుంది. మరికొన్ని నెలల్లో జరగబోయే టీ20 ప్రపంచకప్ పోటీల్లో భారత్ నెగ్గుతుందో.. లేదో వేచిచూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు