Independence Day : స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ.. మెగా ఈవెంట్లలో భారత క్రీడాలోకం ఇలా..!
భారతదేశం ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. అంతర్జాతీయ క్రీడల్లో ఒలింపిక్స్.........
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశం ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. అంతర్జాతీయ క్రీడల్లో ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఐసీసీ నిర్వహించే టోర్నీలు ఎంతో విలువైనవి. వీటిల్లో మెరిసిన క్రీడా తారలు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోతారు. మరి వజ్రోత్సవాల వేళ భారత క్రీడాలోకం సాధించిన ఘనతలను ఓసారి మననం చేసుకుందాం..!
గత ఒలింపిక్స్లోనే అత్యధిక పతకాలు
దాదాపు 125 ఏళ్ల కిందట (1896) తొలిసారి ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. భారత్ మాత్రం 1900వ ఏడాదిలో ఒలింపిక్స్కు ప్రాతినిధ్యం వహించింది. రెండు సిల్వర్ పతకాలను గెలుచుకుంది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి 1948 సమ్మర్ ఒలింపిక్స్లో భారత్ పాల్గొంది. అప్పుడు కేవలం ఒకే ఒక్క స్వర్ణ పతకం వచ్చింది. అదికూడా హాకీలో కావడం విశేషం. మొత్తం ఇప్పటివరకు కేవలం 35 పతకాలను మాత్రమే సాధించింది. అందులో 10 స్వర్ణం, తొమ్మిది రజతం, 16 కాంస్య పతకాలు ఉన్నాయి. టోక్యో వేదికగా జరిగిన 2020 ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా తొలిసారి జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆ ఒలింపిక్స్లో మొత్తం ఏడు పతకాలను భారత్ దక్కించుకుంది. ఇవే భారత చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన ఒలింపిక్స్ కావడం విశేషం.
కామన్వెల్త్లో అదుర్స్..
ఇంగ్లాండ్ పాలించిన దేశాల మధ్య ప్రారంభించిన క్రీడా పోటీలే ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్గా రూపాంతరం చెందాయి. ఒలింపిక్స్లో పెద్దగా రాణించలేకపోయిన భారత అథ్లెట్లు కామన్వెల్త్ గేమ్స్లో మాత్రం అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. 1930నుంచి కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నా.. తొలిసారి భారత్ 1934 నుంచే పాల్గొంటోంది. ఇప్పటివరకు 21సార్లు కామన్వెల్త్ గేమ్స్ జరగ్గా.. భారత్ కేవలం మూడు సార్లు మాత్రమే పాల్గొనలేదు. అయితే మొత్తం 564 పతకాలను సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. అందులో 203 బంగారు, 190 రజతం, 171 కాంస్య పతకాలు ఉన్నాయి. దిల్లీ వేదికగా జరిగిన 2010 కామన్వెల్త్ గేమ్స్లో భారత్ అత్యధికంగా 101 పతకాలు దక్కించుకుని చరిత్ర సృష్టించింది. తాజాగా బర్మింగ్హామ్ వేదికగా జరిగిన గేమ్స్లోనూ ఫర్వాలేదనిపించి 61 పతకాలతో సరిపెట్టుకుంది. ఇందులో 22 స్వర్ణం, 14 సిల్వర్, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. అయితే, షూటింగ్, ఆర్చరీ క్రీడలు లేకపోవడంతో భారత్కు వచ్చే పతకాలు తగ్గిపోయాయి. అనూహ్యంగా లాంగ్జంప్, హైజంప్, క్రికెట్, జూడో, లాన్బౌల్స్ తదితర గేమ్స్లో అద్భుత ప్రదర్శనతో మన క్రీడాకారులు పతకాలు సాధించారు.
మెగా క్రికెట్ కప్లు.. మనకూ భాగస్వామ్యం
ఎన్ని ద్వైపాక్షిక సిరీస్లు గెలిచినా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రపంచకప్లను సొంతం చేసుకుంటే ఆ దర్జానే వేరు. ఇప్పటివరకు 1975నుంచి 12 సార్లు జరిగిన వన్డే ప్రపంచకప్ల్లో టీమ్ఇండియా రెండుసార్లు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 1983లో విండీస్నే ఢీకొట్టి టైటిల్ను సొంతం చేసుకుంది. కపిల్ కెప్టెన్సీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి కప్ను కొట్టడం విశేషం. అలాగే ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమ్ఇండియా 28 ఏళ్ల తర్వాత 2011లో రెండోసారి కప్ను ముద్దాడింది.
ఇక గత పదిహేనేళ్లుగా టీ20 క్రికెట్కు విపరీతమైన ఆదరణ వచ్చింది. తొలిసారి 2007లో ఐసీసీ నిర్వహించిన టీ20 ప్రపంచకప్ను భారత్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఫార్మాట్ కొత్త అయినప్పటికీ అండర్డాగ్స్గా బరిలోకి దిగిన ధోనీ సారథ్యంలోని భారత్ కప్ దక్కించుకోవడం క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇక టెస్టు ఫార్మాట్ను ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ను నిర్వహిస్తున్నారు. తొలిసారి ఫైనల్కు దూసుకెళ్లిన భారత్.. కివీస్ చేతిలో ఓటమిపాలైంది. వజ్రోత్సవం నిర్వహించుకుంటున్న ఈ ఏడాదే ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్ జరగనుంది. మరికొన్ని నెలల్లో జరగబోయే టీ20 ప్రపంచకప్ పోటీల్లో భారత్ నెగ్గుతుందో.. లేదో వేచిచూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు