Javelin: బల్లెం వీరుడు-2.. నీరజ్ చోప్రాకు తోడుగా ఇంకో హీరో
ఆసియా క్రీడల్లోని జావెలిన్ విభాగంలో స్వర్ణం, రజత పతకాలు భారత్ అథ్లెట్లు సాధించారు. జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రాతోపాటు మరొకరు పతకం గెలిచి వార్తల్లో నిలిచాడు. అతడే.. ఒడిశాకు చెందిన కిశోర్ కుమార్.
జావెలిన్ త్రో అంటే ఇన్నాళ్లూ భారత క్రీడాభిమానులకు నీరజ్ చోప్రానే గుర్తుకొచ్చేవాడు. ప్రపంచ స్థాయిలో మనకు ఆశలే లేని ఆటలో అతను అద్భుతాలు చేశాడు. ఒలింపిక్స్లోనే కాక ప్రపంచ ఛాంపియన్షిప్లోనూ విజేతగా నిలిచి ఔరా అనిపించాడు. అయితే ఇప్పుడు నీరజ్కు తోడుగా ఇంకో బల్లెం వీరుడు వచ్చాడు. ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో రజతం గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. భవిష్యత్ దిశగా ఆశలు రేపుతున్న ఆ క్రీడాకారుడే.. కిశోర్ కుమార్ జెనా.
ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల జావెలిన్ త్రో పోటీల్లో.. ముందుగా భారత్ నుంచి నీరజ్ చోప్రానే పోటీలో నిలిచాడు. అతను తన తొలి త్రోను 85 మీటర్ల లోపే దగ్గరగా వేశాడు. తర్వాత భారత్ తరఫున కిశోర్ కుమార్ జెనా బరిలోకి దిగాడు. అతడి మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ 86.77 మీటర్లు త్రో విసిరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. నీరజ్ కన్నా అతడి త్రో దాదాపు రెండున్నర మీటర్లు ఎక్కువ. ఒక్కసారిగా అందిరిలోనూ షాక్. నీరజ్ను మించితే ఏ విదేశీ క్రీడాకారుడో మించాలి కానీ.. ఒక భారత క్రీడాకారుడు అలాంటి ప్రదర్శన చేయడమేంటని అందరూ వింతగా చూశారు ఆ క్రీడాకారుడి వైపు. ఆ సమయానికి అతడిదే అగ్రస్థానం. తర్వాత నీరజ్ 88.88 మీటర్ల త్రోతో అగ్రస్థానం సాధించాడు. కానీ కిశోర్ను మాత్రం వేరే క్రీడాకారులెవరూ అధిగమించలేకపోయారు. దీంతో ఆసియా క్రీడల జావెలిన్ త్రోలో అతడికి రజతం దక్కింది. ఇదేమీ ఆషామాషీ ప్రదర్శన కాదు. ఆసియా స్థాయిలో అతడిది ఆరో ఉత్తమ ప్రదర్శన. గత రెండేళ్లలో కిశోర్ ఎదుగుదల చూస్తే ఆసియా క్రీడల్లో అతడి మెరుపులు గాలివాటం కాదని అర్థమవుతుంది.
నాలుగేళ్ల ముందే ఇటు వైపు..
ఒడిశాకు చెందిన కిశోర్ కుమార్ జెనా నాలుగేళ్ల ముందు వరకు వాలీబాల్ క్రీడాకారుడు కావడం విశేషం. కానీ తన సామర్థ్యానికి జావెలిన్ త్రో బాగా సరిపోతుందని కోచ్ సూచన మేరకు అతను ఈ ఆటలోకి వచ్చాడు. ఎన్నో ఏళ్లు కష్టపడితే తప్ప ఈ క్రీడలో ప్రపంచ స్థాయికి ఎదగడం సాధ్యం కాదు. కానీ కిశోర్ మాత్రం చకచకా ఈ ఆటలో ముందడుగు వేశాడు. ఆటలోకి వచ్చిన రెండేళ్లకే జాతీయ స్థాయికి ఎదిగాడు. రాష్ట్ర జావెలిన్ ఛాంపియన్షిప్లో దాదాపు 77 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకున్నాడు.
కోచ్ సిమ్రన్జీత్ దగ్గర శిక్షణ మొదలయ్యాక కిశోర్ ప్రదర్శన ఇంకా మెరుగుపడింది. ఏడాది కిందట అతను 80 మీటర్ల మార్కును అందుకున్నాడు. కొన్ని నెలల కిందట ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్నకు అర్హత సాధించినప్పటికీ కిశోర్ మీద పెద్దగా అంచనాలు లేవు. అందరి దృష్టీ నీరజ్ మీదే ఉంది. అంచనాలను అందుకుంటూ చోప్రా అక్కడ స్వర్ణం గెలిచాడు. ఆ ఈవెంట్లో 84.77 మీటర్లతో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేయడమే కాక.. అయిదో స్థానం సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్లో అయిదో స్థానం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఆసియా క్రీడల్లో ఇంకా మెరుగైన ప్రదర్శనతో రజతం గెలవడమే కాదు.. వచ్చే ఏడాది ఒలింపిక్స్కు కూడా అర్హత సాధించాడు.
కిశోర్ ప్రదర్శన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను మెప్పించింది. ఆయన ప్రభుత్వం తరఫున అతడికి రూ.1.5 కోట్ల నజరానా ప్రకటించడమే కాక.. ఒలింపిక్స్ సాధన దిశగా కోసం అతడికి అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కిశోర్ ఇదే జోరు కొనసాగిస్తే.. పారిస్లో నీరజ్తో పాటు అతనూ పతకం తెచ్చిపెట్టే అవకాశాలుంటాయి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్