Afghanistan Team: అఫ్గాన్కు నిజంగా ఛాన్సుందా?.. ప్రపంచకప్లో సెమీస్ అవకాశాలు ఏమాత్రం?
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) సెమీస్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇక మిగిలిన లీగ్ మ్యాచ్లు 11 మాత్రమే. ఇంకా మూడు సెమీస్ బెర్తులు తేలాల్సి ఉంది.
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) లీగ్ దశ చివరి అంకంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే భారత జట్టు అధికారికంగా సెమీస్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లాండ్, శ్రీలంక, నెదర్లాండ్స్ల నిష్క్రమణ లాంఛనమే కావచ్చు. మిగతా మూడు బెర్తుల కోసం అయిదు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఆ అయిదు జట్లలో అఫ్గానిస్థాన్ కూడా ఒకటి కావడం విశేషం. ఏడు మ్యాచ్ల్లో నాలుగో విజయం సాధించిన అఫ్గాన్.. పెద్ద జట్లతో పాటుగా సెమీస్ రేసులో నిలిచి ఆశ్చర్యపరిచింది. మరి ఈ జట్టు టోర్నీలో సంచలన విజయాలు సాధించినట్లే.. సెమీస్ బెర్తును కూడా సొంతం చేసుకుని సంచలనం రేపే ఛాన్స్ ఉందా?
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో సెమీస్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇక మిగిలిన లీగ్ మ్యాచ్లు 11 మాత్రమే. ఇంకా మూడు సెమీస్ బెర్తులు తేలాల్సి ఉంది. ఏడుకు ఏడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన భారత్ మాత్రమే సెమీస్ చేరగా.. మిగతా మూడు బెర్తులు తేలాల్సి ఉంది. ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా దాదాపుగా సెమీస్ చేరినట్లే. ఆ జట్టు నెట్ రన్రేట్ కూడా బాగుంది కాబట్టి చివరి రెండు మ్యాచ్ల్లో (భారత్, అఫ్గానిస్థాన్లతో) ఓడినా ముందంజ వేసే అవకాశాలే ఎక్కువ. పట్టికలో ఆ జట్టు రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (6 మ్యాచ్ల్లో 4 విజయాలు), న్యూజిలాండ్ (7 మ్యాచ్ల్లో 4 విజయాలు) తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. 7 మ్యాచ్ల్లో 3 నెగ్గిన పాక్ నిన్నటిదాకా అయిదో స్థానంలో ఉండేది. కానీ శుక్రవారం అఫ్గానిస్థాన్ నాలుగో గెలుపు (ఆడిన మ్యాచ్లు 7)తో అయిదో స్థానానికి ఎగబాకింది. టోర్నీ చివరి దశలో ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక లాంటి జట్లను వెనక్కి నెట్టి అఫ్గాన్ పైన ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.
ముందంజ వేయాలంటే..
కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్థాన్ ప్రదర్శన చూస్తున్న వాళ్లందరూ.. ఈ ప్రపంచకప్లో శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి జట్లను ఓడించగలదనే భావించారు. కానీ ఆ జట్టు అంచనాలను మించిపోయి డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో పాటు పాకిస్థాన్, శ్రీలంకలకు షాకిచ్చింది. టోర్నీని మామూలుగానే ఆరంభించిన ఆ జట్టు.. తర్వాత అనూహ్య ప్రదర్శనతో ఆందరినీ ఆశ్చర్యపరిచింది. చివరి 3 మ్యాచ్ల్లో వరుసగా పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్లను ఓడించడంతో అఫ్గాన్ను ఇప్పుడు అందరూ సీరియస్గా తీసుకుంటున్నారు. అదే ప్రదర్శన కొనసాగించి, అదృష్టం కలిసొస్తే ముందంజ వేసినా వేయొచ్చని భావిస్తున్నారు. న్యూజిలాండ్ వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోవడం అఫ్గాన్లో ఆశలు పెంచుతోంది. దక్షిణాఫ్రికాతో పాటు మంచి ఊపులో ఉన్న ఆస్ట్రేలియా రెండు సెమీస్ బెర్తులు సొంతం చేసుకుంటాయనుకుంటే.. సమీకరణాలు కలిసొస్తే అఫ్గాన్ ముందంజ వేయొచ్చు.
చివరి రెండు మ్యాచ్ల్లో ఆ జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలను ఢీకొనబోతోంది. ఈ రెండు జట్లను ఓడించడం చాలా కష్టమైనప్పటికీ.. అఫ్గాన్ ఒక్క మ్యాచ్లో సంచలనం సృష్టించినా.. దాని అవకాశాలు మెరుగవుతాయి. అదే సమయంలో పాకిస్థాన్, శ్రీలంకలతో తలపడబోతున్న కివీస్.. ఆ రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోవాలి. లేదా ఒక్క మ్యాచ్ ఓడినా.. నెట్రన్రేట్లో అఫ్గాన్ కన్నా వెనుకబడాలి. మరోవైపు ఆస్ట్రేలియా వరుసగా ఓడిపోయినా.. అఫ్గాన్కు ఛాన్సుంటుంది. కానీ అఫ్గాన్కు నెట్రన్రేట్ తక్కువ ఉండటం మైనస్. ఇందులో మిగతా జట్లను అధిగమించడం అంత తేలిక కాదు. అందుకే ఈ సమీకరణాలన్నీ సాధ్యపడి అఫ్గాన్ సెమీస్కు చేరడం చాలా కష్టంగానే కనిపిస్తోంది. కానీ టోర్నీలో ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలను బట్టి చూస్తుంటే మాత్రం ఏదైనా జరగొచ్చని అనిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్, ఈసారి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంటుందని ఎవరైనా ఊహించారా? మరి అఫ్గాన్కు అన్నీ కలిసొచ్చి ముందంజ వేసే అవకాశాలను ఎలా కొట్టి పారేస్తాం?
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా