Rahane-Pujara: ఒకప్పటి టీమ్ఇండియా ‘మిడిల్’.. కొత్త ఏడాదిలోనైనా దక్కేనా ప్లేస్!
దక్షిణాఫ్రికాతో (SA vs IND) తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత లైనప్ పేకమేడలా కూలిన సమయంలో ‘నయా వాల్’ పుజారా.. మన ‘జింక్స్’ రహానె ఉంటే పరిస్థితులు విభిన్నంగా ఉండేదేమో..
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో మ్యాచ్లో (SA vs IND) ఇన్నింగ్స్ తేడాతో భారత్ ఓటమిపాలైన తర్వాత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ఓ మాట అన్నాడు. ‘‘ఇలాంటి సమయంలో రహానె ఉండుంటేనా? పరిస్థితి వేరేగా ఉండేది’’ అవును సన్నీ ఎందుకు అలా అన్నాడనేది రహానె గణాంకాలను చూస్తే అర్థమైపోతుంది. రహానె 2018 పర్యటనలోని జోహెన్నెస్బర్గ్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో కీలకమైన 48 పరుగులు చేశాడు. అవి తక్కువే అయినా.. రహానెనే ఆ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్.
సఫారీ జట్టుతో టెస్టు సిరీస్కు సీనియర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె లేకుండా టీమ్ఇండియా అక్కడికి వెళ్లింది. తొలి టెస్టులోనే వారిద్దరి విలువేంటో తెలుసొచ్చింది. తొలి బంతి నుంచే పేసర్లు చెలరేగిపోయే సఫారీ గడ్డపై క్రీజ్లో కుదురుకోవడం చాలా కీలకం. ఇలాంటి అవకాశాలను ఎన్నోసార్లు ఈ మిడిలార్డర్ ద్వయం అందిపుచ్చుకొంది. కానీ, గత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని వారిద్దరికి అవకాశం ఇవ్వకుండా ఎక్కువ మంది యువకులతో కూడిన జట్టుతోనే ఈసారి దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతోంది. తాజాగా పుజారా, రహానె సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చేందుకేనా అన్నట్లుగా ఉంది. టెస్టుల్లో వీరిద్దరిని కొనసాగించాలనే డిమాండూ క్రికెట్ అభిమానుల నుంచి వెల్లువెత్తుతోంది. యువ క్రికెటర్లను ఇంకాస్త సానబెట్టాలని.. అప్పటి వరకు సీనియర్లను ఆడించాలనేది వారి వాదన.
‘‘విశ్రాంతి రోజులు లేవు..’’ - రహానె
‘‘రంజీ ట్రోఫీ కోసం సన్నద్ధత..’’ - పుజారా
తొలుత అజింక్య రహానె ట్విటర్ వేదికగా ‘విశ్రాంతి తీసుకొనే రోజులు లేవు’ అంటూ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. ఆ తర్వాత పుజారా కూడా ‘రంజీ ట్రోఫీ ప్రిపరేషన్’ అంటూ మరో పోస్టు పెట్టాడు. దీంతో వచ్చే నెలలో ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం జట్టులోకి వచ్చేందుకు రహానె, పుజారా రంజీ ట్రోఫీని సద్వినియోగం చేసుకోవాలనే కామెంట్లు అభిమానులు చేశారు. ఇటీవల జాతీయ జట్టులో ఆడకపోయినప్పటికీ.. రహానె దేశవాళీ క్రికెట్ మాత్రం చాలా ఆడాడు. పుజారా కూడా కౌంటీల్లోనూ ఆడి వచ్చాడు. వీరిద్దరికీ సెనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) జట్లపై మంచి రికార్డు ఉంది. పేస్ బౌలింగ్ను ఎదుర్కొని క్రీజ్లో పాతుకుపోవడం వీరిద్దరి స్పెషాలిటీ. పుజారా దక్షిణాఫ్రికాపై 10 టెస్టుల్లో 535 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్పైనా నిలకడైన ఆటతీరు ప్రదర్శించాడు. ఈ దేశాలపై ఐదు సెంచరీలు చేసిన అనుభవం ఉంది. రహానె కూడా సఫారీ జట్టుపై ఆరు మ్యాచుల్లో 402 పరుగులు చేశాడు.
పుజారా 3.. రహానె 5..
ప్రస్తుతం భారత జట్టు కూర్పులో రెండు స్థానాలు అత్యంత కీలకం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతున్నారు. కానీ, వీరిద్దరిలో కనీసం ఒక్కరైనా క్రీజ్లో పాతుకుపోయేలా ఉండాలి. ఆ తర్వాత మూడో స్థానంలో పుజారా, ఐదో స్థానంలో రహానె సరిగ్గా సరిపోతారు. వీరి మధ్య విరాట్ కోహ్లీ ఎలానూ మంచి ఫామ్లో ఉన్నాడు. విదేశీ పిచ్లపై పుజారా, రహానె ఆటతీరు మరింత బాధ్యతాయుతంగా ఉంటుంది. రంజీ ట్రోఫీ కూడా జనవరి 5 నుంచి మొదలుకానుంది. ఇంగ్లాండ్తో జనవరి 25 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. ఎంత భారత వేదిక అయినప్పటికీ.. ఇంగ్లాండ్ పేస్ను ఎదుర్కోవడం చాలా కష్టమే. ఒకవేళ వీరిద్దరూ రంజీల్లో నాణ్యమైన ప్రదర్శన చేస్తే ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్