SA vs IND: కెప్టెన్ మారాడు.. కొత్త ఆటగాళ్లు వచ్చారు.. మరి ఫలితం?
South Afirca vs India Test Series Preview: దక్షిణాఫ్రికాతో మరోసారి టెస్టు సిరీస్కు టీమ్ఇండియా (Team India) సిద్ధమైంది. సఫారీ గడ్డపై ఇప్పటివరకూ టెస్టు సిరీస్ విజయాన్ని అందుకోలేకపోయిన భారత జట్టు.. ఈ సారి చరిత్ర తిరగరాయాలనే పట్టుదలతో ఉంది.
దక్షిణాఫ్రికాతో మరోసారి టెస్టు సిరీస్కు టీమ్ఇండియా (Team India) సిద్ధమైంది. సఫారీ గడ్డపై ఇప్పటివరకూ టెస్టు సిరీస్ విజయాన్ని అందుకోలేకపోయిన భారత జట్టు.. ఈ సారి చరిత్ర తిరగరాయాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటివరకూ ఆ దేశంలో ఎనిమిది సార్లు టెస్టు సిరీస్ ఆడిన మన జట్టు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. చివరగా 2021-22 సిరీస్లో దక్షిణాఫ్రికాలో భారత్ ఆడింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు జట్టులో ఎన్నో మార్పులు జరిగాయి. కెప్టెన్ మారాడు. సీనియర్లు దూరమయ్యారు. కొత్త ఆటగాళ్లు వచ్చారు. ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో సఫారీ సవాలుకు భారత్ సై అంటోంది.
కెప్టెన్గా చివరిది..
2021-22లో దక్షిణాఫ్రికాలో భారత్ టెస్టు సిరీస్ అనగానే కోహ్లి (Virat Kohli) కెప్టెన్ నుంచి తప్పుకోవడం కచ్చితంగా గుర్తుకొస్తోంది. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 జట్టుకు కెప్టెన్గా కోహ్లి తప్పుకున్నాడు. వన్డేల్లో, టెస్టుల్లో సారథిగా కొనసాగాలనుకున్నాడు. కానీ టీ20లతో పాటు వన్డేల్లోనూ ఒకరే కెప్టెన్ ఉండాలనుకున్న బీసీసీఐ ఆ బాధ్యతలను రోహిత్కు అప్పగించింది. దీనిపై కోహ్లి వర్సెస్ బీసీసీఐ సిట్యుయేషన్ మారింది. వివాదం రేగింది. ఈ నేపథ్యంలో నిరుడు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టెస్టు కెప్టెన్సీకి కూడా కోహ్లి గుడ్బై చెప్పి షాకిచ్చాడు. భారత జట్టు కెప్టెన్గా పూర్తిగా తప్పుకున్నాడు. అప్పటి నుంచి మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ కెప్టెన్సీ కెరీర్ ఆరంభమైంది. ఇప్పుడు మళ్లీ దక్షిణాఫ్రికాతో టెస్టుల కోసం అక్కడికి వెళ్లిన కోహ్లి.. ఇప్పుడు కేవలం ఆటగాడిగానే ఆడబోతున్నాడు.
ఆ సీనియర్లు లేకుండా..
2021-22 టెస్టు సిరీస్తో పోలిస్తే ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న జట్టులో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు చెతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) , అజింక్య రహానె (Ajinkya Rahane) ఇద్దరూ లేకుండా భారత టెస్టు జట్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ ఇద్దరు టెస్టు స్పెషలిస్టు బ్యాటర్లలో ఒక్కరు కూడా జట్టులో లేకుండా భారత్ విదేశాల్లో టెస్టు ఆడబోతుండటం గత దశాబ్ద కాలంగా ఇదే మొదటిసారి. ఈ ఇద్దరు లేకుండా భారత్ దక్షిణాఫ్రికాలో సిరీస్ ఆడబోతుండటం కూడా 2006 తర్వాత ఇదే తొలిసారి. టెస్టు అరంగేట్రం తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్కు పుజారా, రహానె దూరమవడం ఇదే మొదటిసారి. 2022లో సొంతగడ్డపై శ్రీలంకతో సిరీస్లో రెండు టెస్టుల్లో ఈ ఇద్దరికీ చోటు దక్కలేదు. కానీ తిరిగి పుంజుకుని వీళ్లు జట్టులోకి వచ్చారు. అయితే ఇప్పుడేమో దక్షిణాఫ్రికా సిరీస్కు మాత్రం ఎంపిక కాలేకపోయారు. చివరగా దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ఆడినప్పుడు 3 మ్యాచ్ల్లో రహానె 22.66 సగటుతో 136, పుజారా 20.66 సగటుతో 124 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. ఇప్పుడు మంగళవారం ఆరంభమయ్యే టెస్టు సిరీస్కు దూరమైన నేపథ్యంలో ఈ ఇద్దరి కెరీర్ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వీళ్లూ దూరం..
దక్షిణాఫ్రికాలో గత భారత జట్టు టెస్టు సిరీస్తో పోలిస్తే ఈ సారి జట్టులో చాలా కొత్త ముఖాలున్నాయి. అప్పుడు జట్టులో ఉన్న రహానె, పుజారా, మయాంక్ అగర్వాల్, సాహా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, పంత్, షమి, ప్రియాంక్ పాంచల్, హనుమ విహారి, జయంత్ యాదవ్ ఇప్పుడు లేరు. గాయాల కారణంగా ఆ సిరీస్కు దూరమైన రోహిత్ శర్మ, జడేజా, శుభ్మన్ గిల్ ఇప్పుడు జట్టులోకి వచ్చారు. అప్పుడు తొలి టెస్టు తుది జట్టులో ఉన్న వాళ్లలో కేఎల్ రాహుల్, కోహ్లి, అశ్విన్, శార్దూల్, బుమ్రా, సిరాజ్ మాత్రమే ఇప్పుడూ జట్టుతోనూ ఉన్నారు. వీళ్లతో పాటు యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, ముకేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ కొత్తగా జట్టుతో చేరారు. అప్పుడు తొలి మ్యాచ్ గెలిచి మూడు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. ఆ తర్వాత రెండు టెస్టుల్లో తడబడి ఓటమి పాలైంది. మరి ఈ సారి దాదాపు పూర్తిగా మారిన జట్టుతో, కొత్త ఉత్సాహంతో రెండు టెస్టుల సిరీస్లో అడుగుపెడుతున్న భారత్ సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించాలన్నది అభిమానుల ఆకాంక్ష.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో