SA vs IND: కెప్టెన్ మారాడు.. కొత్త ఆటగాళ్లు వచ్చారు.. మరి ఫలితం?
South Afirca vs India Test Series Preview: దక్షిణాఫ్రికాతో మరోసారి టెస్టు సిరీస్కు టీమ్ఇండియా (Team India) సిద్ధమైంది. సఫారీ గడ్డపై ఇప్పటివరకూ టెస్టు సిరీస్ విజయాన్ని అందుకోలేకపోయిన భారత జట్టు.. ఈ సారి చరిత్ర తిరగరాయాలనే పట్టుదలతో ఉంది.
దక్షిణాఫ్రికాతో మరోసారి టెస్టు సిరీస్కు టీమ్ఇండియా (Team India) సిద్ధమైంది. సఫారీ గడ్డపై ఇప్పటివరకూ టెస్టు సిరీస్ విజయాన్ని అందుకోలేకపోయిన భారత జట్టు.. ఈ సారి చరిత్ర తిరగరాయాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటివరకూ ఆ దేశంలో ఎనిమిది సార్లు టెస్టు సిరీస్ ఆడిన మన జట్టు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. చివరగా 2021-22 సిరీస్లో దక్షిణాఫ్రికాలో భారత్ ఆడింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు జట్టులో ఎన్నో మార్పులు జరిగాయి. కెప్టెన్ మారాడు. సీనియర్లు దూరమయ్యారు. కొత్త ఆటగాళ్లు వచ్చారు. ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో సఫారీ సవాలుకు భారత్ సై అంటోంది.
కెప్టెన్గా చివరిది..
2021-22లో దక్షిణాఫ్రికాలో భారత్ టెస్టు సిరీస్ అనగానే కోహ్లి (Virat Kohli) కెప్టెన్ నుంచి తప్పుకోవడం కచ్చితంగా గుర్తుకొస్తోంది. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 జట్టుకు కెప్టెన్గా కోహ్లి తప్పుకున్నాడు. వన్డేల్లో, టెస్టుల్లో సారథిగా కొనసాగాలనుకున్నాడు. కానీ టీ20లతో పాటు వన్డేల్లోనూ ఒకరే కెప్టెన్ ఉండాలనుకున్న బీసీసీఐ ఆ బాధ్యతలను రోహిత్కు అప్పగించింది. దీనిపై కోహ్లి వర్సెస్ బీసీసీఐ సిట్యుయేషన్ మారింది. వివాదం రేగింది. ఈ నేపథ్యంలో నిరుడు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టెస్టు కెప్టెన్సీకి కూడా కోహ్లి గుడ్బై చెప్పి షాకిచ్చాడు. భారత జట్టు కెప్టెన్గా పూర్తిగా తప్పుకున్నాడు. అప్పటి నుంచి మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ కెప్టెన్సీ కెరీర్ ఆరంభమైంది. ఇప్పుడు మళ్లీ దక్షిణాఫ్రికాతో టెస్టుల కోసం అక్కడికి వెళ్లిన కోహ్లి.. ఇప్పుడు కేవలం ఆటగాడిగానే ఆడబోతున్నాడు.
ఆ సీనియర్లు లేకుండా..
2021-22 టెస్టు సిరీస్తో పోలిస్తే ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న జట్టులో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు చెతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) , అజింక్య రహానె (Ajinkya Rahane) ఇద్దరూ లేకుండా భారత టెస్టు జట్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ ఇద్దరు టెస్టు స్పెషలిస్టు బ్యాటర్లలో ఒక్కరు కూడా జట్టులో లేకుండా భారత్ విదేశాల్లో టెస్టు ఆడబోతుండటం గత దశాబ్ద కాలంగా ఇదే మొదటిసారి. ఈ ఇద్దరు లేకుండా భారత్ దక్షిణాఫ్రికాలో సిరీస్ ఆడబోతుండటం కూడా 2006 తర్వాత ఇదే తొలిసారి. టెస్టు అరంగేట్రం తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్కు పుజారా, రహానె దూరమవడం ఇదే మొదటిసారి. 2022లో సొంతగడ్డపై శ్రీలంకతో సిరీస్లో రెండు టెస్టుల్లో ఈ ఇద్దరికీ చోటు దక్కలేదు. కానీ తిరిగి పుంజుకుని వీళ్లు జట్టులోకి వచ్చారు. అయితే ఇప్పుడేమో దక్షిణాఫ్రికా సిరీస్కు మాత్రం ఎంపిక కాలేకపోయారు. చివరగా దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ఆడినప్పుడు 3 మ్యాచ్ల్లో రహానె 22.66 సగటుతో 136, పుజారా 20.66 సగటుతో 124 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. ఇప్పుడు మంగళవారం ఆరంభమయ్యే టెస్టు సిరీస్కు దూరమైన నేపథ్యంలో ఈ ఇద్దరి కెరీర్ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వీళ్లూ దూరం..
దక్షిణాఫ్రికాలో గత భారత జట్టు టెస్టు సిరీస్తో పోలిస్తే ఈ సారి జట్టులో చాలా కొత్త ముఖాలున్నాయి. అప్పుడు జట్టులో ఉన్న రహానె, పుజారా, మయాంక్ అగర్వాల్, సాహా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, పంత్, షమి, ప్రియాంక్ పాంచల్, హనుమ విహారి, జయంత్ యాదవ్ ఇప్పుడు లేరు. గాయాల కారణంగా ఆ సిరీస్కు దూరమైన రోహిత్ శర్మ, జడేజా, శుభ్మన్ గిల్ ఇప్పుడు జట్టులోకి వచ్చారు. అప్పుడు తొలి టెస్టు తుది జట్టులో ఉన్న వాళ్లలో కేఎల్ రాహుల్, కోహ్లి, అశ్విన్, శార్దూల్, బుమ్రా, సిరాజ్ మాత్రమే ఇప్పుడూ జట్టుతోనూ ఉన్నారు. వీళ్లతో పాటు యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, ముకేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ కొత్తగా జట్టుతో చేరారు. అప్పుడు తొలి మ్యాచ్ గెలిచి మూడు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. ఆ తర్వాత రెండు టెస్టుల్లో తడబడి ఓటమి పాలైంది. మరి ఈ సారి దాదాపు పూర్తిగా మారిన జట్టుతో, కొత్త ఉత్సాహంతో రెండు టెస్టుల సిరీస్లో అడుగుపెడుతున్న భారత్ సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించాలన్నది అభిమానుల ఆకాంక్ష.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్