Ajinkya Rahane : టెస్టు ప్లేయర్ అన్నారు.. అత్యధిక స్ట్రైక్రేట్తో చెలరేగుతున్నాడు..
రహానే(Ajinkya Rahane) ఈ సీజన్లో అద్భుత ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అత్యధిక స్ట్రైక్ రేట్తో ఆడుతూ జట్టు భారీ స్కోర్లలో భాగమవుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్ : ఈ సీజన్కుముందు అతడిపై ఎలాంటి అంచనాలు లేవు. కేవలం బేస్ ప్రైస్కే చెన్నై(Chennai Super Kings) దక్కించుకుంది. తుది జట్టులో అవకాశం కల్పించడంతో.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతడే వెటరన్ క్రికెటర్ అజింక్య రహానె(Ajinkya Rahane).
భారీ హిట్టర్లను వెనక్కి నెట్టి..
అజింక్య రహానెపై ఎక్కువగా టెస్టు ప్లేయర్ అని ముద్ర ఉండేది. ఇప్పుడా శైలికి భిన్నంగా.. ఎవరూ ఊహించని విధంగా బ్యాటింగ్ చేస్తూ చెన్నై జట్టుతోపాటు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. బ్యాటింగ్లో అతడి దూకుడు ఎంతలా ఉందంటే.. ఈ ఐపీఎల్లో ఇప్పటి వరకూ అత్యధిక స్ట్రైక్ రేట్ (వంద కంటే ఎక్కువ పరుగులు) అతడి పేరిటే ఉంది. భారీ హిట్టర్లను వెనక్కి నెట్టి 199.04 స్టైక్ రేట్తో రహానె ఈ జాబితాలో ముందున్నాడు. అతడి తర్వాత మాక్స్వెల్ (188 స్ట్రైక్ రేట్), పూరన్ (185 స్ట్రైక్ రేట్), సూర్యకుమార్ యాదవ్ (168 స్ట్రైక్ రేట్) ఉన్నారు.
అన్ని రకాల షాట్లు ఆడుతూ..
గత సీజన్లలో చూసిన రహానే స్ట్రైక్రేట్ ఏమంత గొప్పగా లేదు. 2008 నుంచి 2022 వరకూ అతడి బ్యాటింగ్ గణాంకాలను చూస్తే 120.67 స్ట్రైక్ రేట్తో మొత్తం 4 వేలకుపైగా పరుగులు చేశాడు. యావరేజ్ 30.86కాగా.. ఈ సీజన్లో ఇప్పటి వరకూ అతడి యావరేజ్ 52.25. ఇక సిక్స్లను అలవోకగా దంచి కొడుతున్నాడు. ఈ సీజన్లో దాదాపు ప్రతి 9 బంతులకో సిక్స్ బాదుతున్నాడు. అన్ని రకాల షాట్లు ఆడుతూ అలరిస్తున్నాడు. కోల్కతాపై అతడు ఆడిన రివర్స్ స్కూప్ షాట్పై పలువురు మాజీలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఆదివారం కోల్కతా(KKR)తో జరిగిన మ్యాచ్లో విధ్వంసమే సృష్టించాడు రహానే . 29 బంతుల్లో 71 పరుగులు కొట్టి.. జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. ముంబయితో జరిగిన మ్యాచ్లో కూడా 27 బంతుల్లో 61 పరుగులతో చెలరేగాడు. ఇలా ఇప్పటి వరకూ ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో మొత్తం 209 పరుగులు చేశాడు. ఇప్పటిదాకా ఐపీఎల్లో 153 ఇన్నింగ్స్లు ఆడిన రహానె.. రెండుసార్లు మాత్రమే 200 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. ఈ రెండు సందర్భాలూ ఈ సీజన్లోనే కావడం విశేషం.
రూ.50 లక్షల బేస్ప్రైస్కే చెన్నైకి దక్కిన రహానె.. తన అద్భుత ఆటతీరుతో జట్టుకు న్యాయం చేస్తుండగా.. మిగతా జట్లు కొన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారితో పోల్చుతూ రహానేను అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్